హనుమకొండ/మహబూబాబాద్ రూరల్/జనగామ, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులకు అధినేత కేసీఆర్ గురువారం బీఫాంలు అందజేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అనంతరం వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు డాక్టర్ మారెపల్లి సుధీర్ కుమార్, మాలోత్ కవిత, బోయినపల్లి వినోద్కుమార్, కొప్పుల ఈశ్వర్, క్యామ మల్లేశ్ కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫాం అందుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని అన్నారు. ఎన్నికలు ఏవైనా ఎగిరేది గులాబీ జెండానేనని అన్నారు. ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదన్నారు. పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, శ్రేణులు, కార్యకర్తలు అందరూ కష్టపడి సమన్వయంతో పనిచేస్తే గెలుపు ఖాయమమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీపై వస్తున్న వ్యతిరేకత, ఇచ్చిన హామీల విషయంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని, అలాగే గత పది సంవత్సరాల కాలంలో బీజేపీ తెలంగాణ రాష్ర్టానికి ఏమీ చేయలేదనే అంశాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించారు. కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు సత్యవతిరాథోడ్, సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, యెగ్గె మల్లేశం, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రెడ్యానాయక్, బానోత్ శంకర్నాయక్, హరిప్రియ, గొంగిడి సునీత, వరంగల్, మహబూబాబాద్ జడ్పీ చైర్పర్సన్లు గండ్ర జ్యోతి, అంగోత్ బిందు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మెట్టు శ్రీనివాస్, లింగంపల్లి కిషన్రావు, ఏనుగుల రాకేశ్రెడ్డి, కుడిది మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.