ములుగురూరల్, జనవరి25 : దళితులకు లబ్ధి చేకూర్చింది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు అన్నారు. దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడు కోగిల మహేశ్ ఆధ్వర్యంలో గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద దళిత బంధు లబ్ధిదారులు ఒకరోజు దీక్షను చేపట్టారు. వారికి మలక్ష్మీనర్సింహారావుతో పాటు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవీ సుధీర్యాదవ్, సీపీఎం నాయకులు రత్నం రాజేందర్, ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడు ముంజాల భిక్షపతిగౌడ్, సీపీఐ నాయకుడు రత్నం ప్రవీణ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోరిక గోవింద్నాయక్, పల్లా బుచ్చయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చి మొదటి విడుత లబ్ధిదారులకు వారి ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేసిందన్నారు. 2వ విడుత జిల్లాలో 1,100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా ఎన్నికల కోడ్ కారణంగా ఆగి పోయాయన్నారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దళితుల సంక్షేమాన్ని విస్మరించి వారికి అందాల్సిన దళితబంధు డబ్బులను అడ్డుకున్నదన్నారు. దళితులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అంబేద్కర్ అభయహస్తం పథకం కింద రూ.12లక్షలను దళితులకు అందించాలన్నారు. దీక్షకు భూపాలపల్లి, పినపాక, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడ, ప్రాంతాలకు చెందిన దళిత నాయకులు మద్దతు ప్రకటించారు. ఎంపీటీసీ నూనావత్ మహేష్నాయక్, బీఆర్ఎస్ నాయకుడు కాకులమర్రి ప్రదీప్రావు, దళిత సంఘాల నాయకులు కర్రి శ్యాంబాబు, మేడికొండ రమేశ్, చిన్ని కృష్ణ, రాజేశ్, చంటి, భద్రయ్య, జనగాం రవీందర్, గట్టయ్య, మేదరి రాంబాబు, కొర్రె ఓంకార్, కవ్వంపల్లి బాబు, జన్నారపు శ్రీను, శ్రీనివాస్, మంద కొమ్మాలు, దర్శనాల దేవేందర్, రామకృష్ణ, లేగల రాజు, సమ్మయ్య, జయరాజు దీక్షలో పాల్గొన్నారు.