హనుమకొండ, ఫిబ్రవరి 16: వరంగల్ కేంద్రంగా క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపా ధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్ర భుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యం లో బీఆర్ఎస్వీ, కాకతీయ క్రికెట్ అకాడమీ సం యుక్తంగా నిర్వహిస్తున్న వరంగల్ పశ్చిమ నియో జకవర్గ కేసీఆర్ క్రికెట్ పోటీల ప్రారంభ కార్యక్ర మానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం బ్యాటింగ్, బౌలింగ్ వేస్తూ ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. సీఎం కేసీఆ ర్ నిండు నూరేళ్లు ఆయురాఆరోగ్యాలత్ వర్ధిల్లు తూ దేశానికి సేవ చేయాలని వారు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కేక్ కట్ చేసి ముందస్తు జన్మదిన శుభా కాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వినోద్కుమా ర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రథమ స్థానం లో ఉందని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం గొప్ప విషయమన్నారు. ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా మూడేండ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభి నందనీయమని అన్నారు. వాడవాడలా కేసీఆర్ క్రికెట్ ట్రోఫీని నిర్వహించి, గొప్ప ఆటగాళ్లను దేశానికి అందించేందుకు వేదికలుగా నిలవాలన్నా రు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ క్రీడ లకు ప్రోత్సహిస్తున్నారన్నారు. అందులో భాగం గా ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడాకారు లు ఒలింపిక్ స్థాయిలో పాల్గొనేలా ఉండాలన్నా రు.
గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అన్ని వ ర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తు న్నట్లు తెలిపారు. అలాగే నిరుపేద విద్యార్థులకు విదేశీ విద్యను సైతం అందిస్తున్నామన్నారు. దాస్యం వినయ్భాస్కర్ క్రీడాభిమాని అని, ఆయ న సహకారంతో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. చీఫ్ విప్ వినయ్ భాస ర్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని యువ తలోని క్రికెట్ ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అందించేందుకు కేసీఆర్ క్రికెట్ చాంపి యన్ షిప్ను విజయవంతంగా నిర్వహిస్తున్నా మని అన్నారు. 10 రోజుల పాటు ఉత్సాహంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. మహిళలకు ఇండోర్ గేమ్స్ నిర్వహించడంతో పాటు నయీంన గర్లో హాకీ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భం గా అన్ని మతాల ప్రార్థనాలయాల్లో ప్రత్యేక పూజ లు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్లు నెక్కొండ కవిత, ఏనుగుల మానస, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సి పాల్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య, కాకతీయ క్రికె ట్ అకాడమీ చైర్మన్ ఫారూక్, అస్లాం, షాకీర్, బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ బైరపాక ప్రశాంత్, రాకేశ్యాదవ్, మీడియా ఇన్చార్జి వీరేందర్, పలువురు కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.