పాలకుర్తి, డిసెంబర్ 28 : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం అంగడి బజార్లోని చింతచెట్టు నుంచి కల్లు పారుతున్నది. దీన్ని సోషల్ మీడియాలో పెట్టగా ఈ విచిత్రాన్ని జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తిలకిస్తున్నారు.
కొందరు ఇందులో వింత ఏమీ లేదని, వేప, చింత, మర్రి తదితర చెట్లకు వైరస్ సోకినప్పుడు బెరడు తెగినచోటు నుంచి బ్యాక్టీరియా చేరి నురగలా వస్తుందని, అది తాగితే మత్తు కలిగిస్తుందని అంటున్నారు.