హనుమకొండ సిటీ, జూలై 12 : మత్స్య కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. ఉమ్మడి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సర్వసభ్య సమావేశం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బుస్స మల్లేశం అధ్యక్షతన బుధవారం హనుమకొండలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఎఫ్డీఎస్ సీములో భాగంగా గతంలో రూ.350 కోట్లు కేటాయించగా, మత్స్య కార్మికులకు వా హనాలు, ఇతర సామగ్రిని అందజేశామన్నారు. మరో వెయ్యి నుంచి రెండు వేల కోట్ల వరకు నిధులు కావాలని సీఎం కేసీఆర్ను అడిగామని, త్వరలోనే మంజూరు చే స్తారని నమ్మకం ఉందని చెప్పారు. ఈ నిధులను గతం లో లబ్ధి పొందని మత్స్య కార్మిక కుటుంబాలకు కేటాయిస్తామని తెలిపారు. రైతుబంధు వలె ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం నగదు బదిలీ చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపల మారెట్లు ఏర్పా టు చేసుకోవాలనుకుంటే తన వంతు సహకారం అందిస్తానన్నారు. గతంలో ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడు 10 మంది డైరెక్టర్లు ఉంటే ప్రస్తుతం ఆరుగురు అధ్యక్షులతో పాటు 60 మంది డైరెక్టర్లను నియమించుకునే అవకాశం కలిగిందని తెలిపారు. కో ఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టంలోని చట్టపరమైన వివాదాల వల్ల నియామకాల్లో జాప్యమైందని, సొసైటీ లేని 1500 గ్రామాలను గుర్తించగా, ఇప్పటికే వెయ్యి గ్రామాల్లో సొసైటీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ప్రభుత్వ సీములతోపాటు, ప్రమాద బీమా అందాలంటే తప్పనిసరిగా మత్స్య కార్మిక కార్డు పొంది ఉండాలన్నారు. ఇందుకోసం త్వరలోనే మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్ర మత్స్య శాఖ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో జరిగిన జాతీయ మత్స్య కార్మిక దినోత్సవంలో దేశంలో ఎకడా లేని విధంగా 5 లక్షల మంది మత్స్య కార్మికుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ప్రారంభించామని పేర్కొన్నారు. మత్స్య కార్మికులు చేప పిల్లలను చెరువులో పోస్తున్నప్పుడు నాణ్యత పరిశీలనతో పాటు పెంపకంపై దృష్టి సారించాలన్నారు. చెరువే బతుకుదెరువు అనుకున్నప్పుడు చెరువులపై పట్టింపు ఉండాలని సూచించారు. ప్రధానంగా ఇన్సురెన్స్ విషయంలో హెల్ప్లైన్ను ఆశ్రయిస్తున్నారని, 2014 నుంచి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న వాటిని పరిషరించేందుకు బండా ప్రకాశ్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వమే మత్స్య కార్మికుల నుంచి చేపలను కొనుగోలు చేసే దిశగా ఆలోచన చేస్తున్నదని తెలిపారు. ముదిరాజ్ మహాసభ నాయకులు పులి రజినీకాంత్, పల్లబోయిన అశోక్, యాదగిరి, రాజు, బయ్య స్వామి, మత్స్యశాఖ అధికారులు అవినాశ్, భారతి, నరేశ్, నాగులు పాల్గొన్నారు.
ఆక్వాకల్చర్ అభివృద్ధి చేస్తాం : రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ రవీందర్
హనుమకొండ చౌరస్తా : రాష్ట్రంలోని మత్స్య సహకార సంఘాల్లోని సుమారు ఐదు లక్షల సభ్యుల కు టుంబాల సర్వతోముఖాభివృద్ధికి ఆక్వాకల్చర్ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ సమగ్ర అధ్యయనం చేసేందుకు సిద్ధపడుతున్నట్లు చైర్మన్ పిట్టల రవీందర్ వెల్లడించారు. బుధవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులకు ఆక్వా కల్చర్లో అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేపల పెంపకానికి శిక్షణ దోహదం చేస్తుందన్నారు. ఆక్వాకల్చర్తో చేపల ఉత్పత్తిని వేగవంతం చేయడంతో పాటు ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతెందని చెప్పారు. సాంప్రదాయ పద్ధతుల్లో ఒక హెక్టారుకు ఒక టన్ను చేపలను మాత్ర మే ఉత్పత్తి చేసేందుకు అవకాశాలు ఉండగా, ఆక్వాకల్చర్లో మూడు నుంచి ఐదు టన్నుల చేపలను ఉత్పత్తి చేసేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. మత్స్య సహకార సంఘాల్లోని యువతను ప్రోత్సహించి కేజీ కల్చర్, బయోఫ్లాగ్ ఫిష్ ఫార్మింగ్, పెన్ కల్చర్ తదితర ఆధునిక విధానాలను ద్వారా మధ్యతరహా, భారీ జలాశయాల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని, 40 శాతం నుంచి 60 శాతం మందికి సబ్సిడీ అందించేందుకు ప్రత్యేక పథకాలను రూపొందిస్తున్నట్లు వివరించారు.
ఉమ్మడి జిల్లాలోని నీటి వనరులను ప్రయోగాత్మక పద్ధతిలో ఎంపిక చేసేందుకు పరిశీలిస్తున్నట్లు చె ప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆరున్నర లక్ష ల హెక్టార్ల నీటి విస్తీర్ణం చేపల పెంపకానికి అనువుగా ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత 7.30 లక్షల హెక్టార్లకు పెరిగిందన్నారు. 2014లో చేపల వార్షి క ఉత్పత్తి రెండున్నర లక్షల టన్నులు ఉండగా, ప్రస్తు తం నాలుగున్నర లక్షలకు పెరిగిందని, ఆక్వా కల్చర్ విధానాలతో రానున్న మూడు సంవత్సరాల్లో కనీసం 10 లక్షల టన్నులకు పెంచుకునేందుకు ఆసారం కలుగుతుందని వివరించారు. చేపలను శుద్ధి చేయడం (ఫిష్ ప్రాసెసింగ్), అదనపు విలువల జోడింపు (వ్యాల్యూ ఆడిషన్), చేపలు మరియు రొయ్యల పచ్చళ్లు, ఎండు చేపలు తదితర చేపల ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. చేప ఉత్పత్తులను తయారు చేసే చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఉమ్మడి జిల్లా అత్యంత అనువైన ప్రదేశంగా గుర్తించినట్లు తెలిపారు. అలాగే మారెటింగ్లో దళారీ వ్యవస్థకు ప్రభుత్వం చెక్ పెట్టిందన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ద్వారా 9 సంవత్సరాల్లో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి రెండింతలకు పెరిగిందని చెప్పారు.
సీఎం కేసీఆర్ చొరవతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం..
తెలంగాణలోని మత్స్యకారులందరికీ సంవత్సరం పొడవునా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే లక్ష్యం తో సీఎం కేసీఆర్ చొరవతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా సుమారు 1.18 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. తెలంగాణలోని 5 లక్షల మంది మత్స్యకారుల కుటుంబాల ఆదాయ వనురులను పెంపొందించాలనే లక్ష్యంతో ఆక్వాకల్చర్ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.