జయశంకర్ భూపాలపల్లి : ఆధిపత్యం కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రమంత్రి వస్తున్నాడంటే భూపాలపల్లికి ఏమైనా తీసుకుస్తున్నాడని ఆశపడ్డాం. వట్టి చేతులతో వచ్చి వట్టి చేతులతో వెళ్లడం తప్ప చేసిందేమీ లేదన్నారు.
తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో గెలిచి కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏమీ చేయలేకపోయాడని విమర్శించారు. కిషన్ రెడ్డి ఉత్తి రబ్బర్ స్టాంప్. ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో కీలుబొమ్మ అన్నారు. వెనుకబడిన జిల్లా అని చెప్పి భూపాలపల్లికి ఏమైనా మెడికల్ కాజీ తీసుకు వచ్చిండా..కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఏమైనా తీసుకొచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ గెలవడం అసాధ్యం. రాబోయే ఎన్నికల్లో 100 సీట్లకు పైగా సీట్లు సాధిస్తామని ఆయన తెలిపారు.