జయశంకర్ భూపాలపల్లి : దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరం అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు.
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రేగొండ మండల కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ వంటి నాయకులు అవసరం ఉందన్నారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మూడు రోజులు పాటు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.