అంబేద్కర్ చిత్రపటాల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధుల నివాళి
రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ
నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్26 : ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో శుక్రవారం 72వ రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళుల్పించారు. ములుగు డీఎంహెచ్వో కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లె అప్పయ్య, డీఈవో కార్యాలయంలో డీఈవో ఫణిని అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో ఎస్సీ కాంప్లెక్స్ ఆవరణలో జిల్లా కోఆర్డినేటర్ మైస సతీశ్, జిల్లా ఇన్చార్జి నరేశ్కుమార్ అధ్యక్షతన వేర్వేరుగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. వేర్వేరు కార్యక్రమాల్లో ఏఎంవో బద్దం సుదర్శన్రెడ్డి, కోఆర్డినేటర్లు రమాదేవి, సాంబయ్య, రాజు, సైన్స్ అధికారి జయదేవ్, డీఎంహెచ్వో కార్యాలయ సిబ్బంది , బీఎస్పీ నాయకులు మమత, సాగర్, పొన్నాల స్వామి, రఘు, రవి, యాకయ్య, తిరుపతి, వెంకన్న, హరి, దేవేందర్ పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో జడ్పీ సీఈవో శోభారాణి ఆధ్వర్యంలో, జిల్లా వైద్యశాఖ అధికారి కార్యాలయంలో డీఎంహెచ్వో డాక్టర్ శ్రీరాం, ప్రగతి భవన్లో డీఆర్డీవో పురుషోత్తం ఆధ్వర్యంలో రాజ్యాంగ దిపోత్సవం నిర్వహించారు. అధికారులు, సిబ్బందితో భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా కేంద్రంలోని బాల రక్షా భవన్లో జిల్లా బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ రాజ్యాంగ ప్రవేశికను చదివారు. బాల రక్షా భవన్ కౌన్సిలర్ స్వప్న, సోషల్ వర్కర్ శైలజ, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో దళిత్ శక్తి ప్రోగ్రాం నాయకులు అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీఎస్పీ నాయకులు మంగళపెల్లి రాజ్ కుమార్, దొమ్మటి రవీందర్, రవి, తిరుపతి, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏటూరునాగారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ, తుడుందెబ్బ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేర్వేరుగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కబ్బాక శ్రావణ్కుమార్ , కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్షుడు రఘు, కన్నాయిగూడెం జడ్పీటీసీ నామ చందు, నాయకులు వావిలాల ఎల్లయ్య, చెన్నూరి బాలరాజు,వసంత శ్రీనువాస్, జనార్థన్, తుడుందెబ్బ డివిజన్ నాయకులు కాపుల సమ్మయ్య, సర్పంచ్ ఈసం రామ్మూర్తి, పంచాయతీ కార్యదర్శి రఫియుద్దీన్ పాల్గొన్నారు. మంగపేటలోని కళాశాలలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రిన్సిపాల్ వెంకటయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు. తాడ్వాయిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఆస్నాల శ్రీనివాస్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. గోవిందరావుపేట మండలంలోని చల్వాయిలో దళిత్ శక్తి ప్రోగాం(డీఎస్పీ) ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ములుగు జిల్లా కార్యదర్శి సాగర్మహరాజ్ సర్పంచ్ ఈసం సమ్మయ్య, ఉప సర్పంచ్ తేల్ల హరిప్రసాద్తో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకుడు ప్రణయ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వాజేడు మండలంలోని మొరుమురు జీపీ ప్రగళ్లపల్లిలో సర్పంచ్ పూసం నరేశ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంగన్వాడీ టీచర్స్ కళావతి, ఝాన్సీరాణి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. చిట్యాల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని మండల కేంద్రంలో నిర్వహించారు. ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు పుల్ల మల్లయ్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దళిత్ శక్తి ప్రోగ్రాం మండల అధ్యక్షుడు శీలపాక నాగరాజు, నవాబుపేటలో సర్పంచ్ సాయిసుధ, గిద్దెముత్తారంలో సర్పంచ్ పొలవేన పోషాలు వేర్వేరుగా రాజ్యాంగ ఆమోద దినోత్సవంను నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో చిట్యాల ఎంపీటీసీ దబ్బెట అనిల్, గుర్రపు రాజేందర్, జన్నె యుగేంధర్, బొడ్డు ప్రభాకర్, నేరేళ్లప్రేమ్, రాజేందర్ పాల్గొన్నారు. భూపాలపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ శ్యాం ప్రసాద్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డీ.సంధ్య, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వెంకటాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో, జవహర్నగర్ మోడల్ స్కూల్, పాలంపేట ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. తహస్దీల్దార్ మంజుల, డిప్యూటీ తహసీల్దార్ తఫజుల్ హుస్సేన్, ఆర్ఐ రాజకుమారి, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, ఏఎస్వో నాగరాజు, మోడల్ స్కూల్ హెచ్ఎం కుమార్, పాలంపేట ఉన్నత పాఠశాలల హెచ్ఎం ప్రభాకర్, శ్రీరంగం, ఉపాధ్యాయలు, విద్యార్థులు పాల్గొన్నారు. కాటారం మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్ర పటానికి ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఎంపీడీవో ఆంజనేయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు. దళిత్ శక్తి ప్రోగ్రాం మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో ఎంపీవో మల్లికార్జున్రెడ్డి, ఏపీవో వెంకన్న, ఎంపీటీసీ ఉడుముల విజయలక్ష్మి, పర్యవేక్షకులు శ్రీధర్బాబు, దళిత్ శక్తి ప్రోగ్రాం జిల్లా కార్యదర్శి చిట్యాల శ్రీనివాస్, మండల నాయకులు సురేశ్, శ్యాం, రాజేందర్, ప్రభాకర్, జగన్, జీవన్, శ్రీకాంత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. టేకుమట్ల మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ మండల కన్వీనర్ సంగి రవి, దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో మండల వేర్వేరుగా రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నుద్దునూరి రాజ్కుమార్, మాడుగుల వెంకట్, రవి వర్మ, శ్యామ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. వెంకటాపురం(నూగూరు) మండల కేంద్రంలో తెలంగాణ మాదిగ జెఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూళమాల వేసి నివాళులర్పించారు. మాదిగ జెఏసీ రాష్ట్ర కన్వీనర్ కొడారి ధీరన్, నాయకులు యాసం శ్రీను, రమేశ్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. కన్నాయిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దేవాసింగ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రతిజ్ఞ చేశారు. వేడుకల్లో ఆర్ఐ గణేశ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.