ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
ఎమ్మెల్సీ నిధుల నుంచి కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు
జఫర్గఢ్, జనవరి23: తెలంగాణలో కుల వృత్తులకు పెద్దపీట వేసిన ఘణత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆదివారం అన్నారు. మండలంలోని రఘునాథపల్లి గ్రామ యాదవ, ముదిరాజ్ కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ. 20 లక్షలు శ్రీహరి మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కడియంను హనుమకొండలోని ఆయన నివాసంలో రఘునాథపల్లి గ్రామానికి చెందిన యాదవ, ముదిరాజ్ కులస్తులు, గ్రామస్తులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛలను అందించారు. అనంతరం రఘునాథపల్లిలో యాదవ కమ్యూనిటీ భవనం, ముదిరాజ్ కమ్యూనిటీకి భవనాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరడంతో స్పందించిన కడియం తన కోటా నుంచి నిధులు రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. యాదవ కమ్యూనిటీకి రూ.10 లక్షలు, ముదిరాజ్ కమ్యూనిటీకి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్సీకి యాదవ, ముదిరాజ్ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మినేని శ్రీదేవి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి, యాదవ సంఘం నాయకులు చల్ల సమ్మయ్య, వెంకటయ్య, ఎల్లయ్య, రత్నాకర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మట్టపల్లి బుచ్చయ్య, ఆగయ్య, ఉప్పలయ్య శ్రీనివాస్, రెడ్డి సంఘం అధ్యక్షుడు బొమ్మినేని రాజిరెడ్డి, పాపిరెడ్డి, కోమల్రెడ్డి, తిరుపతిరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.