పార్టీ నుంచి మంజూరైన రూ. 2 లక్షల బీమా చెక్కు అందజేత
ఆనందం వ్యక్తం చేస్తున్న మృతుల కుటుంబాలు
ఏటూరునాగారం, జనవరి 23 : కార్యకర్తల కుటుంబానికి అండగా టీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని పార్టీ మండల అధ్యక్షుడు గడదాసు సునీల్కుమార్ అన్నారు. మండలంలోని రామన్నగూడేనికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మద్దూరి నాగేశ్వర్రావు ఆరు నెలల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో పార్టీ మంజూరు చేసిన రూ. 2 లక్షల బీమా చెక్కును మృతుడి భార్య లక్ష్మీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకూ రూ. 2 లక్షల బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ చొరవతో చెక్కు మంజూరైనట్లు ఆయన వివరించారు. పంపిణీలో జడ్పీ కో ఆప్షన్ సభ్యురాలు వలియాబీ, సీనియర్ నాయకుడు పోరిక గోవింద్నాయక్, తుమ్మ మల్లారెడ్డి, ఎంపీటీసీ అల్లి సుమలత, కుడుముల లక్ష్మీనారాయణ, గుడివాడ శ్రీహరి, సర్పంచ్ దొడ్డ కృష్ణ, ఇట్టం నాగరాజు, పల్ల రఘు, ఖాజాపాషా, చంద్రబాబు, నాగసాగర్, నాగరాజు, ఈసం స్వరూప, చందా లక్ష్మీనారాయణ, గండపెల్లి నర్సయ్య, పల్ల రాంబాబు, ప్రమోద్, కన్నెబోయిన రాజు, కొండాయి చిన్ని పాల్గొన్నారు.
మంగపేటలో..
మంగపేట : మండలానికి చెందిన గుంజ లక్ష్మయ్య, మల్లూరుకు చెందిన సాయిని రాంబాబు ప్రమాదవశాత్తు ఇటీవల మృతి చెందారు. బాధిత కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ మంజూరు చేసిన రూ.2 లక్షల చెక్కులను పార్టీ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ అందజేశారు. కార్యక్రమంలో మంగపేట రైతు సేవా సహకార సంఘం చైర్మన్ తోట రమేశ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యురాలు వలియాబీ, సీనియర్ నేతలు గోవిందనాయక్, వైకుంఠం, శేషగిరిరావు, తుమ్మ మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, సహకార డైరెక్టర్లు డేగల ఆదినారాయణ, నర్రా శ్రీధర్, సిద్ధంశెట్టి లక్ష్మణ్రావు, నర్సయ్య, పూజారి శ్రీను, చిట్టిమల్ల సమ్మయ్య, చిలకమర్రి రాజేందర్, ఎం శంకర్, గాదె శ్రీనివాసాచారి, బాబు, రామకృష్ణ, నూతులకంటి ముకుందం, శానం నరేందర్, చిట్టిబాబు, తిరుపతి, నూనె లింగయ్య, మండల మహిళా అధ్యక్షురాలు గోస్కుల లక్ష్మి, రాణి, కృష్ణవేణి, సరిత, సోయం ఈశ్వర్, సోషల్ మీడియా ఇన్చార్జి శ్రీహరి పాల్గొన్నారు.