ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
నర్సంపేటలో పశువుల అందాల పోటీలు
నర్సంపేట, జనవరి 14: ఒకప్పుడు పాడి పశువులతో పల్లెలు విల్లసిల్లేవని, ఎక్కడ చూసినా పశువుల మందలు కనిపించేవని, ఇప్పుడు తగ్గిపోయినట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శాంతిసేనా రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పశువుల అందాల పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పశువులను పరిశీలించారు. పశువులతో చాలా లాభాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, సీఐ పులి రమేశ్, పశుసంవర్ధక శాఖ అధికారి జంగిల్హాలి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, సొసైటీ చైర్మన్ మురాల మోహన్రెడ్డి, ఆర్ఎస్ఎస్ సభ్యులు మోతె జైపాల్రెడ్డి, అధ్యక్షుడు చిలువేరు కుమారస్వామి, ఎర్ర జగన్మోహన్రెడ్డి, ఈగ సత్యనారాయణ, పాల్గొన్నారు. కాగా, జోడి ఎడ్ల ప్రథమ బహుమతిని బోయిని శివప్రసాద్(రూ. 6116, షీల్డు, ద్వితీయ బహుమతిని తోగరు సారంగం(రూ. 4116, షీల్డు), కన్సోలేషన్ ప్రైజ్ అమ్మ కట్టయ్య గెలుచుకున్నారు. పాడిగేదెల పోటీల్లో ప్రథమ బహుమతిని గాదె కరుణాకర్ (రూ. 5116, షీల్డు), ద్వితీయ బహుమతిని మజ్జిగ రాజు (రూ. 2116, షీల్డు) గెల్చుకున్నారు. ఆవుదూడ పోటీల్లో ప్రథమ బహుమతిని గాదె వెంకట్రెడ్డి (రూ.3116, షీల్డు, ద్వితీయ బహుమతిని చింతల నరేందర్ (రూ. 2116, షీల్డు), వేల్పుల రవివర్మ కన్సోలేషన్ బహుమతి పొందారు. గొర్రెపోతు విభాగంలో ప్రథమ బహుమతిని కనిగంటి శ్రీనివాస్ (రూ. 2116, షీల్డు), ద్వితీయ బహుమతిని గిరగాని కన్నయ్య (రూ. 1,116, షీల్డు), మేకపోతు విభాగంలో ప్రథమ బహుమతిని వేల్పుల విక్రమ్ (రూ. 2116, షీల్డు), ద్వితీయ బహుమతిని విస్రం కుమార్ (రూ. 1,116, షీల్డు), పెంపుడు కుక్కల పోటీల్లో ప్రథమ బహుమతిని నాడెం సందీప్ (రూ. 2116, షీల్డు), ద్వితీయ బహుమతిని బుర్ర వేణు (రూ. 1,116, కన్సోలేషన్ బహుమతిని చిలువేరు సాయివరుణ్, కోడిపుంజు విభాగంలో ప్రథమ బహుమతిని అందె స్వామి (రూ. 2,116, షీల్డు, ద్వితీయ బహుమతిని ఎస్ రవిచంద్ర (రూ.1,116, షీల్డు, కాన్సోలేషన్ బహుమతిని దార ప్రవీణ్ గెలుచుకున్నారు.