మొగుళ్లపల్లి మండలకేంద్రంలోని
ఫూలే బాలుర రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభానికి ఏర్పాట్లు
పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చిట్యాల(మొగుళ్లపల్లి), ఫిబ్రవరి 1: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావుఫూలే కేజీ టు పీజీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభానికి ఈ నెల 7న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డితోపాటు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవంలో పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పాఠశాలలో ఏర్పాట్లను పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. విద్యార్థులు కొవిడ్ ని బంధనలు పాటించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ యార సుజాతాసంజీవరెడ్డి, జడ్పీటీసీ జోరుక సదయ్య, పీఏసీఎస్ చైర్మన్ నర్సింగరావు, మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, సర్పంచ్ ధర్మారావు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.