దళితుల ఆర్థిక స్వావలంబనే సీఎం లక్ష్యం
రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికీ దళిత బంధు వర్తింపజేస్తాం
మొదట నియోజకవర్గానికి 100 యూనిట్లు
టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
వర్ధన్నపేట/ న్యూశాయంపేట, జనవరి 31: తెలంగా ణలో ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా పరిపుష్టి సాధించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన గొప్ప పథ కం దళితబంధు అని, సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతి అని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట నియోజ కవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకులతో దళితబంధు అమలుపై సోమవారం హంటర్ రోడ్డులో ని సీఎస్ఆర్ గార్డెన్లో అవగాహన సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందశాతం రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అం దుతుందని హామీ ఇచ్చారు. మొదటి విడుతగా ప్రభు త్వం నియోజకవర్గానికి 100 యూనిట్లు కేటాయించిం దని చెప్పారు. యూనిట్ల అమలు అంశంపై సలహాలు, సూచనల కోసం త్వరలోనే దళిత బంధు కమిటీలును సైతం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజాప్రతి నిధులు చూసుకోవాలని సూచించారు. పథకాన్ని పార దర్శకంగా అమలయ్యేలా చూస్తామని వివరించారు. ప్రధానంగా ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న వర్ధన్నపేట నియో జకవర్గంలోని దళిత కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే రమేశ్ స్పష్టం చేశా రు. పథకం విషయంలో ఎలాంటి అపోహలకు గురి కావొద్దని, ప్రతి కుటుంబానికి దశల వారీగా పథకం అం దుతుందని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, నియోజకవర్గ ప్రజాప్రతినిధు లు, పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.