స్టేషన్ ఘన్పూర్: ఎమ్మెల్యే రాజయ్య టీఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శిగా వారణాసి రామక్రిష్ణను నియమించారు. బుధవారం స్టేషన్ ఘన్పూర్ మండలానికి చెందిన వారణాసి రామకృష్ణకు ఎమ్మెల్యే రాజయ్య నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్యకు పూల బోకేను అందించి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో పదవి ఇచ్చినందుకు ఎమ్మెల్యే రాజయ్య ఆదేశాల మేరకు పార్టీ అభివృద్దికి కృషి చేస్తానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ గుజ్జరి రాజు, ఎంపిపీలు రడపాక సుధర్శన్, నిమ్మ కవిత, ధర్మసాగర్ మండల పార్టీ అధ్యక్షుడు మునిగెల రాజు, స్టేషన్ ఘన్పూర్ మండల ఎస్సి సెల్ వర్కింగ్ ప్రసిడెంట్ గుర్రపు యేసుబాబు, మండల యూత్ అధ్యక్షులు గుండే మల్లేష్, సీనియర్ నాయకులు మంద ఆరోగ్యం, టీఆర్ఎస్వీ నియోజకవర్గ కో ఆర్డీనేటర్ కంతి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.