జనగామ రూరల్ : ధాన్యం కొనగుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ ఏపూరి భాస్కర్రావు అన్నారు. బుధవారం మండలంలోని పెంబర్తి, వెంకిర్యాల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని, ప్రభుత్వ మద్ధతు ధరను పొందాలన్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిర్వాహకులు ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలన్నారు.
ప్రతి రైతు తమ బ్యాంకు ఖాతా నంబర్కు ఫోన్ నంబర్ లింక్ తప్పకుండా ఉండాలన్నారు. లేకుంటే ఆన్లైన్ చేయించుకోని బ్యాంక్ ఖాతా నంబర్ ఇవ్వలన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ రవీందర్, ఏఈవో సౌజన్య, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.