స్టేషన్ఘన్పూర్/బచ్చన్నపేట/నర్మెట/ చిల్పూ రు, ఫిబ్రవరి 18 : భక్తుల ఇలవేల్పులైన సమ్మక్క, సారలమ్మ మినీ జాతరలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లించి తన్మయత్వానికి లోనై ‘జై సమ్మక్క.. జై సారలమ్మ’ అంటూ నినదించారు. స్టేషన్ఘన్ఫూర్ మండలం ఇప్పగూడెం చింతగట్టు సమ్మక్క జాతరలో శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో కనిపించారు. తాటికొండ మల్లన్నగండి సమీపంలో వనదేవతలకు వన దేవతలకు మొక్కలు చెల్లించారు. బుధవారం సారలమ్మ, పగిడిగిద్ద రాజు, జంపన్న గద్దెలకు చేరుకోగా, గురువారం రాత్రి డప్పు చప్పుల్లతో సమ్మక్క గద్దెకు చేరింది. దీంతో భక్తులు ఒక్కసారిగా పులకించిపోయారు. ఇప్పగూడెం చింతగట్టు, తాటికొండ మల్లన్నగండి జాతరలో సారలమ్మను కొలిచేందుకు సుమారు లక్షా యాబై వేలకు పైగా భక్తులు హాజరయ్యారు. అందరి కష్టాలు తీర్చి సుఖ సంతోషాలు కల్పించమని అమ్మవారిని వేడుకున్నారు. జాతరలకు సుమారు లక్ష మందికిపైగానే భక్తులు వచ్చారని చింతగట్టు జాతర ఇన్చార్జి, బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ ఈవో లక్ష్మీప్రసన్న, జాతర సమన్వయ కమిటీ కన్వీనర్ వెన్నకూస రాంనర్సయ్య, తాటికొండ సర్పంచ్ చల్లా ఉమాసుధీర్రెడ్డి, వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి తెలిపారు. చింతగట్టు జాతరలో పూజారులు వెంకటేశ్వర్లు, సమ్మక్క, కొంతం మల్లేష్, పిట్టల మొగిళి, మందపురం బాషా పాల్గొన్నారు. తాటికొండ జాతరలో పూజారులు ఆదినారాయణ, రఘు, ప్రవీణ్ వనదేవతలకు పూజలు నిర్వహించారు.
శివసత్తుల విన్యాసాలు
డప్పుచప్పుళ్ల మధ్య శివసత్తుల విన్యాసాలు కొనసాగాయి. వనదేవతలైన సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో మినీమేడారం జాతరలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పగూడెం మిని మేడారం జాతరలో చిల్పూరు బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ ఈవో లక్ష్మీప్రసన్న, జాతర సమన్వయ కమిటీ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
వనదేవతలను దర్శించుకున్న సీఐలు, ఎస్సైలు
చింతగట్టు జాతరలో వనదేవతలను స్టేషన్ఘన్పూర్, నర్మెట, వర్ధన్నపేట సీలు ఎడవెళ్లి శ్రీనివాస్రెడ్డి, కరుణా కర్, సదన్కుమార్, ఎస్సైలు శ్రీనివాస్, శ్రవణ్కుమార్ దర్శించుకున్నారు. సీఐ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ సమ్మక్క, సారలమ్మను వేలాదిగా భక్తులు దర్శిం చుకున్నారని తెలిపారు. జాతరను విజయవంతం చేసిన భ క్తులకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేవాదాయ శాఖ అధికారి లక్ష్మీ ప్రసన్న, జాతర సమన్వయ కమిటీ కన్వీనర్, కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం పోలీసు అధికారులను దేవాదాయ శాఖ అధికారి లక్ష్మీప్రసన్న సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ కన్వీనర్ వెన్నకూస రాంనర్సయ్య, చైర్మన్ అజయ్రెడ్డి, గౌరవ అధ్యక్షుడు తోట వెంకన్న, టీఆర్ఎస్ ఇప్పగూడెం శాఖ అధ్యక్షుడు జూలుకుంట్ల రాజశేఖర్ రెడ్డి, జాతర కమిటీ మాజీ చైర్మన్ మందపురం ఎల్లగౌడ్, సొసైటీ డైరెక్టర్ చట్ల యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
మన్సాన్పల్లిలో..
బచ్చన్నపేట మండలం మన్సాన్పల్లిలో సమ్మక్క- సారలమ్మ జాతర ఘనం గా జరుగుతున్నది. ఈ నెల 16న సారలమ్మ, 17న సమ్మక్క గద్దెలకు చేరుకోగా శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవార్లకు చీర, సారె పెట్టి ఒడిబియ్యం పోశారు. ఇంటిల్లిపాదిని చల్లంగ చూడు తల్లీ అని ప్రార్థించారు. జాతర కమిటీతోపాటు సర్పంచ్ పంజాల తారాశ్రీధర్గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మన్సాన్పల్లి అడవిలో కొండపై వెలిసిన వనదేవతల ప్రదేశానికి పెద్ద సంఖ్యలో సమీప గ్రామాల ప్రజలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు తాగునీరు, విద్యుత్, వైద్య సౌకర్యం కల్పించారు. శనివారం అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ఘట్టం ముగుస్తుందని జాతర నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు.
అమ్మాపురంలో..
నర్మెట మండలం అమ్మాపురంలో వనదేవతల జాతర వైభవంగా జరుగుతున్నది. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం సైతం ఎంతోమంది తమ ఎత్తుబంగారం, పసుపు కుంకుమ, కొబ్బరికాయలు సమర్పించి కోరిన కోర్కేలు తీర్చాలి తల్లీ అని పూజలు చేశారు. ఆదివాసీ పూజారులతో ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఆలయకమిటీ సభ్యులు, నాయ కులు పాల్గొన్నారు.
చిల్పూరులో..
చిల్పూరు మండల కేం ద్రంలోని మబ్బుగుట్ట వద్ద వనదేవతల జాతర వైభవం గా కొనసాగుతున్నది. శుక్ర వారం పెద్ద సంఖ్యలో భక్తులు సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు. వివిధ గ్రామాల నుంచి శివసత్తులు డప్పు చప్పుళ్లతో వచ్చి సమ్మక్క, సారలమ్మకు మొక్కులు చెల్లించారు. తమ ఎత్తు బంగారం(బెల్లం) సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవార్లను ఎంపీపీ బొమ్మిశెట్టి సరితాబాలరాజు, స్థానిక సర్పంచ్ ఉద్దెమారి రాజ్కుమార్, సమ్మక్క, సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ ఆవుల లింగయ్య, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్తోపాటు పలు వురు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈ కార్య క్రమంలో ఉప సర్పంచ్ పిట్టల మహేందర్, జాతర కమిటీ సభ్యులు మాచర్ల ప్రవీణ్కుమార్గౌడ్, గనగోని రమేశ్, వెంకన్న ఉన్నారు.