కొడకండ్ల/ పెద్దవంగర, జూన్ 9 : 70 ఏళ్లలో లేని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఏడేళ్లలో చేసి చూపిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పునరుద్ఘాటించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరంలో గురువారం పల్లె ప్రగతి కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని గ్రామస్తులు బోనాలు, బతుకమ్మలు, కోలాటం, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. రూ.కోటితో రామవరం-పలుగులతండా, రూ.2కోట్లతో రామవరం-తిరుమలగిరి రోడ్డు పనులకు, క్రీడా ప్రాంగణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ మందుల శిరీష మల్లేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో దయాకర్రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఓర్వలేక ప్రతి పక్షాలు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నాయని విమర్శించారు. ధరలు దించుతామని కేంద్రంలో గద్దెనెక్కిన బీజేపీ ఇప్పుడు ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. రూ.46వేల కోట్లతో ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్న ఘనత దేశంలో ఒక్క తెలంగాణకే దక్కిందన్నారు. పల్లె ప్రగతితో గ్రామాలు వికసిస్తునాయన్నారు.
ఇప్పటివరకు రామవరానికి రూ. 5కోట్ల నిధులు ఇచ్చామని చెప్పారు. త్వరలోనే 365 రోజులు సాగు నీరందేలా కాలువ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. సొంత జాగలో ఇల్లు నిర్మించుకునే వారికి రూ.3లక్షలు ఇస్తామని చెప్పా రు. జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే ప నులు 80శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఇక్కడ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, అదనపు కలెక్టర్లు అబ్దుల్ హమీద్, భాస్కర్రావు, పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావు, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీఆర్డీవో రామ్ రెడ్డి, డీపీవో రంగాచారి, డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి, రైతు బంధు సమతి జిల్లా సభ్యుడు సిందె రామోజీ, ఎంపీపీ ధరావత్ జ్యోతి, జడ్పీటీసీ కేలోత్ సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ పేరం రాము, టీఎస్ ఈజీసీ సభ్యుడు అందె యాకయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పసునూరి మధుసూదన్, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్ పాల్గొన్నారు.
కొరిపెల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కొరిపెల్లిలో మంత్రి దయాకర్రావుకు గ్రామస్తులు కోలాటాలు, బతుకమ్మలు, డప్పుచప్పుళ్లలో స్వాగతం పలుకగా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సర్పంచ్ గాజుల శోభ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం ప్రపం చ దేశాలకు ఆదర్శమని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. కరోనా కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాల అమలు ఎక్కడా ఆగలేదన్నారు. రాష్ట్రంలో గ్రామాలకు జాతీయ స్థాయి అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పల్లె ప్రగతిలో సర్పంచ్ల పాత్ర కీలకమని, పార్టీలకు అతీతంగా కలిసిరావాలని కోరారు. గ్రామంలో రూ.40లక్షలతో సీసీ రోడ్లు, రూ.20లక్షలతో డ్రైనేజీని ప్రారంభించారు. రూ.1.50కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్ధిదారులకు అందించారు. కొరిపెల్లి-రంగాపురం వరకు రూ.1.30కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
గ్రామంలో చేపట్టిన పనులపై కార్యదర్శి రజిత ద్వారా తెలుసుకుంటూ గ్రామస్తులు చెప్పేవి నిజమేనా అని ప్రశ్నిస్తూ కార్యదర్శిని అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య, జడ్పీ సీఈవో రమాదేవి, ఆర్డీవో రమేశ్, ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, జడ్పీటీసీ జ్యోతిర్మయి, తహసీల్దార్ రమేశ్బాబు, ఎంపీడీవో వేణుగోపాల్రెడ్డి, ఎంపీటీసీ సబిత, పాలకుర్తి దేవస్థానం చైర్మన్ రామచంద్రయ్యశర్మ, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు నెహ్రూనాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐలయ్య, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కల్పనయాదవ్, కోఆప్షన్ సభ్యులు ముజీబుద్దీన్, సోమనర్సింహారెడ్డి, సుధీర్కుమార్, శ్రీనివాస్, వెంకన్న, జ్ఞానేశ్వరాచారి, వెంకట్రెడ్డి, సమ్మయ్య, రాజుయాదవ్, సమ్మయ్యయాదవ్, వెంకటసోములు, సోమనర్సయ్య, లింగమూర్తి పాల్గొన్నారు.
నాడు ఎన్టీఆర్.. నేడు కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో నాడు ఎన్టీఆర్, స్వరాష్ట్రంలో నేడు కేసీఆర్ రైతుల పాలిట దేవుళ్లుగా నిలిచారని కొనియాడారు. మహిళా సాధికారకతకు నాడు ఎన్టీఆర్ కృషి చేస్తే నేడు కేసీఆర్ సైతం ప్రత్యేక చొరవతో రుణాలు అందిస్తూ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నారని చెప్పారు. 104 స్వయం సహాయక సంఘాల కోసం శ్రీతులసి మండల సమాఖ్యకు రూ.5.20కోట్ల చెక్కును అందించారు. కొరిపెల్లికి చెందిన విద్యార్థి ఎడ్ల నాని సైన్స్ఫెయిర్లో రాష్ట్ర స్థాయిలో రాణించగా అతడిని మంత్రి అభినందించారు.