పాలకుర్తి రూరల్, జూన్ 7: పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి పాటుపడాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబె ల్లి దయాకర్రావు సూచించారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన మండలం లోని ఈరవెన్ను, బమ్మెర గ్రామాల్లోని దళిత, బీసీ కాలనీల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. గ్రామాల్లో పలు అభి వృ ద్ధి పనులకు కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. పారిశు ధ్యంపై మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈరవెన్ను బమ్మెర గ్రామాల అభివృద్ధి, పల్లె ప్రగతి పనులపై పంచాయతీ కార్యదర్శుల నుంచి వివరాలను అడిగి తెలుసు కున్నారు. వికలాంగుడు బీరెల్లి నర్సయ్య ద్విచక్ర వాహనం ఎక్కి ప్రజలను ఉత్సాహపరిచారు. ఆనంతరం మంత్రి ఎర్ర బెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతి ఓ అద్భుత కార్యక్రమమన్నారు.
దీంతో గ్రామాల రూపు రేఖ లు మారుతున్నాయన్నారు. పల్లె ప్రగతితోపాటు అభివృద్ధి లో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. పల్లె ప్రగతి లో సర్పంచ్లదే కీలకపాత్ర అన్నారు. పార్టీలకతీతంగా సర్పంచ్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పల్లె ప్రగతిలో రాజకీయాలకు తావులేదని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. సర్పంచ్లు ఏపార్టీలో ఉన్నా గ్రామాభివృద్ధి కోసం తనను కలవాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నా యని మండిపడ్డారు. సర్పంచ్లు ఆ పార్టీల మాటలు నమ్మొ ద్దన్నారు. సర్పంచ్లకు నిధులు విడుదల చేశామన్నారు. రైతులు, పేదలను రెండు కళ్లుగా చూసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో నాడు ఎన్టీఆర్.. నేడు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నాడన్నారు. తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ ఇద్దరి సీఎంలనే చూశానన్నారు. సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమన్నారు.
మిషన్ భగీర థ పథకం అద్భుతమన్నారు. తాను మంత్రినైనా మిషన్ భగీరథ నీళ్లే తాగుతానన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. రాష్ర్టానికి రావాల్సిన రూ.1400 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రం ఇవ్వాల్సిన రూ. 165కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేశా మన్నారు. ఈజీఎస్ నిధుల కోసం త్వరలోనే తమ శాఖ కార్యదర్శి ఢిల్లీకి వెళ్తున్నాడన్నారు. కేంద్రం రాష్ర్టానికి అవా ర్డులు ఇస్తుంది కానీ నిధులు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. దేశంలో 20 ఉత్తమ గ్రామ పంచాయతీలకు 19 గ్రామ పంచాయతీలు తెలంగాణ నుంచే ఎంపిక చేశారన్నారు. పల్లె ప్రగతిలో సర్పంచ్ల పాత్ర కీలకమన్నారు. పార్టీలకతీతంగా సర్పంచ్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్య లు తప్పవని హెచ్చరించారు. పల్లె ప్రగతితో గ్రామాలు పరిశు భ్రంగా ఉండాలన్నారు. సర్పంచ్లు నిధులు రావడం లేదని చెప్పడం పద్ధతి కాదన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి నిధు లను విడుదల చేశామన్నారు.
పాలకుర్తి ప్రజల ఆశీర్వాదం తో ఎమ్మెల్యేగా గెలిచానని, సీఎం కేసీఆర్ దయతో మంత్రి నయ్యానన్నారు. పాలకుర్తి మండలంలో డబుల్ రోడ్లను మంజూరు చేశానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేశానని చెప్పా రు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తానన్నారు. పాల కుర్తిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, జెడ్పీ చైర్మెన్ పాగాల సంపత్రెడ్డి, అదనపు కలెక్టర్ ఎండీ హమీద్, డిప్యూ టీ కమిషనర్ రామారావు, డీఆర్డీఓ గూడూరు రాంరెడ్డి, డీపీఓ రంగాచారి, ఆర్డీవో కృష్ణవేణి, డీఈలు నాగేళ్లి సదానం దం, ఎఫ్ఎల్ చారి, శ్రీనివాస్, సంధ్యారాణి, ఏసీపీ గొల్ల రమేశ్, వైద్యాధికారి ప్రియాంక, ఎంపీపీ నల్లానాగిరెడ్డి, జడ్పీ టీసీ పుస్కూరి శ్రీనివాసరావు, పాలకుర్తి వ్యవసాయ మార్కె ట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మెన్ బొబ్బల ఆశోక్రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, సర్పంచ్లు ముస్కు నిర్మల, జలగం నాగభూషణం, ఎం పీటీసీ కోడిశాల యాదగిరి, వైస్ ఎంపీపీ శారద, మేడారపు సుధాకర్, పాము శ్రీనివాస్, ఏడీఈ శ్రీధర్రావు, ఏఈలు సుమన్, జవహర్, ప్రశాంతి పాల్గొన్నారు.