స్టేషన్ ఘన్పూర్, జూన్2: క్రీడల్లో ప్రోత్సహించడానికే గ్రా మాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మె ల్యే తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని రాఘవాపూ ర్, చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలోని క్రీడా ప్రాంగ ణాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా కబడ్డీ, వాలీబాల్ ఆడి ఉత్సాహ పరిచారు. అనంతరం పల్లగుట్ట సర్పంచ్ బొట్టు మానస అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడారు. యువత చదువుతోపాటు శారీరకంగా దృఢంగా ఉండాలన్నారు. అప్పు డే వారిలో జ్ఞాపకశక్తితోపాటు ఆత్మైస్థెర్యం పెంపొందుతుందనే ఉద్దేశంతోనే గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తు న్నామని పేర్కొన్నారు. వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో కుమారస్వామి, జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, నియోజకవర్గ ఆఫీస్ ఇన్చార్జి ఆకుల కుమార్, ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య, సర్పంచ్ కందుల శ్రీలతాశ్రీను, ఈ జీఎస్ ఏపీఎం ప్రేమయ్య, లింగాల ఘన్పూర్ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కందుల గట్టయ్య, చిల్పూర్ ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, ఎంపీపీ బొమ్మిశెట్టి సరితా బాలరాజు, నియోజకవర్గ కోఆర్డి నేటర్ పోలెపల్లి రంజిత్రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ శ్యాంరెడ్డి, హరీశ్, దేవస్థాన డైరెక్టర్ సంపత్ రాజు, టీఆర్ఎస్ శ్రేణులు, ఈజీఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.