స్టేషన్ ఘన్పూర్, జూన్ 2 : ప్రత్యేక తెలంగాణను ఎవరూ ఇవ్వలేదని..కొట్లాడి తెచ్చుకున్నామని పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం మండలంలోని తాటికొండ గ్రామంలో సర్దార్ స ర్వాయి పాపన్న గడిలో ఎమ్మెల్యే రాజయ్య అధ్యక్షతన నియో జకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజ రై మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ చావు నోట్ల తలపెట్టి రాష్ర్టాన్ని సాధించాడని అన్నారు. దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించామని చెప్పుకునే కాంగ్రెస్, తెలంగాణ ను కేసీఆర్ తెచ్చాడని చెబితే ఎందుకు అంగీకరించదని, గాంధీ లా రాష్ట్రం కోసం కేసీఆర్ పోరాడి సాధించారన్నారు. ఎనమి దేళ్లు పండుకున్న బీజేపీ నాయకులు ఇప్పుడు మేం ఉన్నామని తిరుగుతు న్నారని అన్నారు. ఆనాడు పేద ప్రజల అభివృద్ధి కోసం ఎన్టీఆర్, నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాటు పడుతున్నా రని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత మేనమామ లా కల్యాణలక్ష్మి పథకం ద్వారా నిరుపేద ఆడబిడ్డలను ఆదు కుంటున్నారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక తెలం గాణలో కొత్తగా రిజర్వాయర్లు, కాల్వలు ఏర్పాటు చేయడమే కాకుండా, ఉన్న వాటిలో నీటి సామర్థ్యం పెంచి 365 రోజుల పాటు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకున్నారని అ న్నా రు. అలాగే 24 గంటలపాటు వ్యవసాయానికి నాణ్యమైన కరంటును అందిస్తు న్నారని చెప్పారు. రైతుల కోసం ముఖ్య మంత్రి ఇంత చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకోలేద న్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఒప్పించి లెటర్ తీసుకవస్తే, తెలంగాణ కోసం ఎమ్మెల్యే రాజయ్య అధికార పార్టీని, ఎమ్మెల్యే పదవిని కాదని తెలంగాణ జెండా పట్టారని అన్నారు. జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి కూడా తెలంగాణ ఉధ్యమంలో కీలక పాత్ర పోషించారని వారిని అభినందించారు. తాటికొండ సర్పంచ్ చల్లా ఉమా సుధీర్ రెడ్డి, వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి కోరిక మేరకు తాటికొండ గ్రామాభివృద్ధికి రూ. కోటి మంజూరు ఇస్తానని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.
దేశం మొత్తం కేసీఆర్ను కోరుకుంటుంది: రాజయ్య
వెనుకబడి ఉన్న తెలంగాణను ఎనమిదేళ్లలో అభివృద్ధి చేసి చూపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ను భారతదేశం మొత్తం కావాలని కోరుకుంటుందని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు సాదించాలంటే ఒక్క తెలంగాణ తోనే సాధ్యమవుతుందని, చావు నోట్లో తల పెట్టి ప్రత్యేక తెలం గాణను ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారని కొని యాడారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖా గట్టయ్య, మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్, నియోజకవర్గ ఆఫీస్ ఇన్చార్జి ఆకుల కుమార్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు తాటి కొండ సురేశ్, మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజుతోపాటు ఏడు మండలాల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.