దేవరుప్పుల/పాలకుర్తి రూరల్, మార్చి2: పేద ధనిక భేదం లేనిదే ప్రభుత్వ బడి అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దేవరుప్పుల మండలం రామరాజుపల్లి, పాలకుర్తిలోని మంత్రి క్యాంప్ కార్యాలయం లో పాలకుర్తి, కొడకండ్ల మండలాల అధికారులు, ప్ర జాప్రతినిధులతో బుధవారం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. మంత్రి ఎ ర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సర్కారు పాఠశాలలకు పూర్వవైభవం తేవడానికి తెలంగాణ ప్ర భుత్వం ‘మన ఊరు-మన బడి’ ప్రవేశపెట్టిందన్నారు. రూ.7200 కోట్లతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి అధునాతన తరగతి గదులు, పూర్తిస్థాయి మౌలిక వసతులతో ఆంగ్ల బోధన ప్రారంభించనున్నామని తెలిపా రు. మూడు విడుతల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అన్ని పాఠశాలలకు వర్తింపజేసి పూర్తిస్థాయిలో ఉచితం గా నాణ్యమైన, ఆంగ్లభాషలో విద్యను అందించేందు కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. మూడేళ్లలో పాఠశాలల రూపురేఖలు మారుస్తామన్నారు. రూ.కోట్లు ఖర్చు చేసి పాఠశాలలు అభివృద్ధి చేసినా విద్యార్థుల తల్లిదండ్రులు దృష్టి పెట్టకపోతే పాతరోజులే పునరావృతమవుతాయని పేర్కొ న్నారు. పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు, గ్రామానికి చెందిన శ్రేయోభిలాషులు విరాళాలు ఇచ్చి పాఠశాలల అభివృద్ధికి సహకరించాలన్నారు. దాతల పేర్లు, ఫొటో లు బడుల్లో ప్రదర్శిస్తామని తెలిపారు.
రామరాజుపల్లి పాఠశాలకు రూ.కోటి కేటాయిస్తామని, వీటితో సర్వాం గ సుందరంగా ఆవరణ, డిజిటల్ తరగతి గదులు, అధునాతన మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నిచర్, డైనిం గ్ హాల్, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. దేవరుప్పుల మండలంలోని పాఠశాలలు జనగామ జిల్లాలో నంబర్వన్గా ఉండేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులపై ఉందన్నారు. బంగారు తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకోసమే విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. రామరాజుపల్లికి చెందిన పూర్వ విద్యార్థి బండి నర్సింహులు రూ. 25 వేలు, ముత్తారం సర్పంచ్ కల్వల భాస్కర్రెడ్డి-శీల దంపతులు రూ. లక్ష, గూడూరు మాజీ సర్పంచ్ మాచర్ల పుల్లయ్య రూ. లక్ష విరాళాన్ని ఆయా పాఠశాలలకు ఇస్తున్నట్టు ప్రకటించారు.
బమ్మెర, మల్లంపల్లి సర్పంచ్లపై మంత్రి ఆగ్రహం..
ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనని బమ్మెర, మల్లంపల్లి సర్పంచ్లపై మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్ పవర్ రద్దు చేసి సంబంధిత ప్రజా ప్రతినిధులకు అప్పగించాలని కలెక్టర్ను ఆదేశించారు.