స్టేషన్ ఘన్పూర్, ఫిబ్రవరి 19 : వనదేవతల జాతరలు కన్నులపండువగా జరిగాయి. నాలుగు రోజులపాటు భక్తులతో పూజలందుకున్న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు శనివారం వనప్రవేశం చేశారు. స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెం చింతగట్టు జాతర, తాటికొండ శివారు మల్లన్నగండి వద్ద జరిగిన జాతరలకు నిత్యం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ నెల 16న ప్రారంభమైన జాతరలు శనివారం వరకు కొనసాగాయి. చివరి రోజు అమ్మవార్లు వన ప్రవేశం చేశారు. నాలుగు రోజులపాటు జరిగిన జాతరలకు చుట్టు పక్కల గ్రామాలతో పాటు, పొరుగు మండలాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకున్నారు. గత జాతరలో అమ్మవార్లను కోరిన కోర్కెలు నెరవేర్చడంతో భక్తులు ఆనందంతో ఎదురుకోళ్లు ఇచ్చారు. యాటలు, కోళ్లను బలిచ్చారు. ‘మమ్మల్ని చల్లగా చూసి, అందరూ సంతోషంగా ఉండేలా దీవించు తల్లీ.. మల్లొచ్చే జాతరకు వస్తాం’ అని తిరుగుపయనమయ్యారు. వనప్రవేవం సందర్భంగా గిరిజన వడ్డెలు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి వనంలోకి తీసుకెళ్లారు. జాతరలో భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, హెల్త్, గ్రామ పంచాయతీ, విద్యుత్, ఎన్సీసీ, పోలీస్ శాఖలు, జాతర కమిటీలు, గ్రామ పెద్దలు సమస్టి కృషితో పనిచేసి విజయవంతం చేశారు. ఇప్పగూడెం చింతగట్టులో జాతర ఇన్చార్జి బుగులు వెంకటేశ్వరస్వామి ఆలయ ఈవో లక్ష్మీప్రసన్న, జాతర సమన్వయ కమిటీ కన్వీనర్ వెన్నకూస రాంనర్సయ్య, చైర్మన్ అజయ్రెడ్డి, జాతర మాజీ చైర్మన్లు కత్తుల కట్టయ్య, టీఆర్ఎస్ ఇప్పగూడెం గ్రామ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, మందపురం ఎల్లగౌడ్, శిరీష్రెడ్డి, సొసైటీ డైరెక్టర్ చట్ల యాకయ్య, పూజారులు వెంకటేశ్వర్లు, సమ్మక్క, కొంతం మల్లేశ్, పిట్టల మొగిళి, మందపురం బాషా పాల్గొన్నారు. తాటికొండ మల్లన్నగండి జాతరలో వైస్ ఎంపీపీ చల్లా సుధీర్రెడ్డి, ఉప సర్పంచ్ మారపాక రాములు, జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమ్మక్క, సారలమ్మకు మొక్కలు చెల్లించి వన ప్రవేశం చేయించారు.
అమ్మాపురంలో..
నర్మెట : మండలంలోని అమ్మాపురం శివారులో సమ్మక్క, సారలమ్మ జాతర వైభవంగా జరిగింది. నాలుగు రోజులపాటు భక్తులతో పూజలందుకున్న వనదేవతలు శనివారం వనప్రవేశం చేశారు. బుధవారం ప్రారంభమైన జాతర శనివారం వరకు కొనసాగింది. మండలంలోని గ్రామాల ప్రజలతోపాటు పొరుగు మండలాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. గద్దెలపై కొలువైన అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. మళ్లీ రెండేళ్లకు జరిగే జాతరకు వస్తాము తల్లీ అంటూ భక్తులు వెనుదిరిగారు.
చిల్పూరులో..
చిల్పూరు : మండల కేంద్రంలోని మబ్బుగుట్టతో పాటు లింగంపల్లి, శ్రీపతిపల్లి, ఫతేపూర్ గ్రామాల్లో వనదేవతల జాతరలు వైభవంగా జరిగాయి. చివరి రోజు శనివారం సమ్మక్క, సారలమ్మను ఆదివాసీ పూజారులు వనప్రవేశం చేయించారు. నాలుగు రోజులపాటు భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ బొమ్మిశెట్టి సరితాబాలరాజు, చిల్పూరు, లింగంపల్లి, శ్రీపతిపల్లి, ఫత్తేపూర్ సర్పంచ్లు ఉద్దెమారి రాజ్కుమార్, ఎద్దునూరి రవీందర్, కేశిరెడ్డి ప్రత్యూషామనోజ్రెడ్డి, భూక్యా తులసి, జాతర కమిటీ చైర్మన్లు మోతె శ్రీనివాస్, ఆవుల లింగయ్య, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కేశిరెడ్డి మనోజ్రెడ్డి, భూక్యా రవి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కనకంటి రవీందర్, ఉప సర్పంచ్ పిట్టల మహేందర్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గాలి ప్రవీణ్, రచ్చ రవి, గౌడ సంఘం మండల అధ్యక్షుడు గానగోని రమేశ్గౌడ్, మాచర్ల ప్రవీణ్కుమార్గౌడ్, ఆల య ఈవో శేషుభారతి, స్టేషన్ ఘనపూర్ సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్సైలు రమేశ్నాయక్, గోపి పాల్గొన్నారు.
మన్సాన్పల్లిలో..
బచ్చన్నపేట : మండలంలోని మన్సాన్పల్లిలో వనదేవతల జాతర వైభవంగా జరిగింది. నాలుగు రోజు ల పాటు జరిగిన జాతరలో చివరి రోజు శనివాం సమ్మ క్క, సారలమ్మను గిరిజన పూజారులు వన ప్రవేశం చే యించారు. అంతకు ముందు జాతర కమిటీ సభ్యులు అమ్మవార్లకు పూజలు చేశారు. చల్లంగ చూడు సమ్మక్క తల్లీ అంటూ మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పంజాల తారాశ్రీధర్గౌడ్, జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.