జనగామ చౌరస్తా, ఫిబ్రవరి 19 : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్) నుంచి ప్రజలకు సేవలందుతున్నాయి. ఈ నెల 11న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నూతన కలెక్టరేట్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాఖల వారీగా కార్యాలయ గదులు, అధికారుల చాంబర్లను జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య కేటాయించారు. రెండు అంతస్తుల్లో ఉన్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గ్రౌండ్ ఫ్లోర్ను ‘జీ’ అని, ఫస్ట్ ఫ్లోర్ను ‘ఎఫ్’ అని, సెకండ్ ఫ్లోర్ ‘ఎస్’ అనే ఇంగ్లిష్ ఆల్ఫాబెట్ లెటర్స్తో గుర్తిస్తూ గదులకు నంబర్లు కేటాయించారు. మంత్రి చాంబర్, కలెక్టర్, అదనపు కలెక్టర్లు(రెవెన్యూ, స్థానిక సంస్థలు), కలెక్టరేట్ సెక్షన్ అధికారులు, సిబ్బందితో పాటు 31 ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులకు, సిబ్బందికి కలెక్టరేట్లో గదులను కేటాయించారు.
గ్రౌండ్ ఫ్లోర్లో..
గ్రౌండ్ ఫ్లోర్లో జీ-1 గదిని ఏడీ, హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్తో పాటు జిల్లా ఉపాధి కల్పన శాఖకు కేటాయించారు. జీ-2, జీ-3 గదులను రిజర్వ్లో ఉంచారు. జీ4 గదిని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారిణి చాంబర్కు కేటాయించారు. జీ-5 గదిని ఈడీఎం, హెచ్హెచ్పీ పర్సన్స్, ధరణి సిబ్బందికి కేటాయించారు. జీ-5/1 గదిని ఎన్ఐసీ డీఐవో అండ్ స్టాఫ్కు, జీ-5/2 గదిని ఎన్ఐసీ/ వీసీ హాల్ కోసం కేటాయించారు. జీ-6 గదిని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ స్టాఫ్ కోసం కేటాయించారు. జీ-7 గదిని ఎస్డీసీ ఎల్ఏ యూనిట్-1 జనగామ స్టాఫ్ కోసం కేటాయించారు. జీ-8 గదిని ఎస్డీసీ ఎల్ఏ యూనిట్-1 ఛాంబర్కు కేటాయించారు. జీ-9 గదిని కలెక్టర్ రికార్డు రూం, రికార్డు కీపర్కు కేటాయించారు. జీ-12 గదిని ఏడీ (సర్వే/ ల్యాండ్ రికార్డ్స్ జనగామ స్టాఫ్కు కేటాయించారు. జీ-13 గదిని ఏడీ సర్వే/ ల్యాండ్ రికార్డ్స్ చాంబర్కు కేటాయించారు. జీ-16 గదిని స్వాన్/ టీ ఫైబర్ నెట్వర్క్కు, జీ-17 గదిని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్కు కేటాయించారు. జీ-19 గదిని డీటీవో గార్డు రూం, జీ-20 గదిని డీటీవో స్ట్రాంగ్ రూంకు కేటాయించారు. జీ-22 గదిని అటెండర్స్ లంచ్ రూమ్ కోసం కేటాయించారు. జీ-23 గదిని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో) కలెక్టరేట్, జీ-24 గదిని కలెక్టరేట్ స్టాఫ్, ఏ, బీ, ఐ సెక్షన్ స్టాఫ్, జీ-సూపరింటెండెంట్ విత్ స్టాఫ్, ఈ-సూపరింటెండెంట్ విత్ స్టాఫ్కు కేటాయించారు. జీ-25 గదిని కలెక్టరేట్ ఇన్ వార్డు, ఔట్ వార్డు సెక్షన్ కోసం కేటాయించారు. జీ-26 గదిని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) చాంబర్కు, జీ-27 గదిని సీసీ, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)కు కేటాయించారు. జీ-32 గదిని హెల్త్ సూపరింటెండెంట్/ కేర్ టేకర్ అండ్ స్టాఫ్కు, జీ-33 గదిని కలెక్టరేట్ సూపరింటెండెంట్, సీ సెక్షన్, ఎఫ్ సెక్షన్ విత్ స్టాఫ్, సూపరింటెండెంట్ డీఅండ్కే విత్ స్టాఫ్కు, జీ-36 గదిని పెద్ద కాన్ఫరెన్స్ హాల్కు కేటాయించారు. జీ-37 గదిని వెయిటింగ్ హాల్కు, జీ-38 గదిని సీసీ టు అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)కు, జీ-39 గదిని అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)కు కేటాయించారు. జీ-40 గదిని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ కోసం, జీ-41 గదిని సీసీ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్కు, జీ-42 గదిని జిల్లా కలెక్టర్ చాంబర్ కోసం కేటాయించారు.
ఫస్ట్ ఫ్లోర్లో..
ఇక ఫస్ట్ ఫ్లోర్లో ఎఫ్-1 గదిని పీడీ, డీఆర్డీవో చాంబర్, స్టాఫ్ కోసం కేటాయించారు. ఎఫ్-2 గదిని జిల్లా ఖజానా అధికారి చాంబర్, స్టాఫ్కు, ఎఫ్-3 గదిని చీఫ్ ప్లానింగ్ అధికారి కార్యాలయం, స్టాఫ్కు, ఎఫ్-4 గదిని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ చాంబర్కు కేటాయించారు. ఎఫ్-5 గదిని డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ చాంబర్, స్టాఫ్కు, ఎఫ్-8 గదిని జిల్లా ఖజానా అధికారి చాంబర్, స్టాఫ్కు కేటాయించారు. ఎఫ్-12 గదిని మినీ కాన్ఫరెన్స్ హాల్కు, ఎఫ్-14 గదిని డీఎంహెచ్వో స్టాఫ్కు, ఎఫ్-15 గదిని డీఎంహెచ్వో చాంబర్కు,ఎఫ్-17 గదిని జిల్లా పంచాయతీ అధికారి చాంబర్, స్టాఫ్కు కేటాయించారు. ఎఫ్-18 గదిని జిల్లా విద్యాశాఖ అధికారి చాంబర్కు, ఎఫ్-19 గదిని ఏడీ, హార్టికల్చరల్ అధికారి చాంబర్, స్టాఫ్కు, ఎఫ్-24 గదిని జిల్లా మత్స్యశాఖ అధికారి చాంబర్, స్టాఫ్కు కేటాయించారు. ఎఫ్-25 గదిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎస్సీ కార్పొరేషన్ అధికారుల చాంబర్, స్టాఫ్కు, ఎఫ్-26 గదిని జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్, స్టాఫ్కు కేటాయించారు. ఎఫ్-27 గదిని జిల్లా విద్యాశాఖ అధికారి, స్టాఫ్కు, ఎఫ్-28 డీపీఆర్వో చాంబర్, స్టాఫ్కు, ఎఫ్-29 గదిని మినిష్టర్ చాంబర్కు కేటాయించారు.
సెకండ్ ఫ్లోర్లో..
సెకండ్ ఫ్లోర్లో ఎస్-1 గదిని కమర్షియల్ టాక్స్ అధికారి చాంబర్, స్టాఫ్కు, ఎస్-2 గదిని రిజర్వ్ చేశారు. ఎస్-3 గదిని జిల్లా మేనేజర్ (సివిల్ సైప్లె) కార్యాలయానికి, ఎస్-4 గదిని జిల్లా సివిల్ సైప్లె అధికారికి కేటాయించారు. ఎస్-8 గదిని కాన్ఫరెన్స్ హాల్కు, ఎస్-10 గదిని డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ చాంబర్, స్టాఫ్కు, ఎస్-13 గదిని రిజర్వ్ చేశారు. ఎస్-14 గదిని ఏడీ, మైన్స్ అండ్ జియాలజీ ఆఫీస్ స్టాఫ్, ఆఫీసర్ చాంబర్కు, ఎస్-15 జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ చాంబర్, స్టాఫ్కు కేటాయించగా, ఎస్-16 గదిని రిజర్వ్ చేశారు. ఎస్-17 గదిని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఆర్అండ్బీ) చాంబర్, స్టాఫ్కు, ఎస్-18 గదిని జిల్లా మేనేజర్, పరిశ్రమల శాఖ అధికారి చాంబర్, స్టాఫ్కు, ఎస్-19 గదిని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి చాంబర్కు, ఎస్-20 గదిని జిల్లా ఇంటర్ అధికారి కార్యాలయం స్టాఫ్కు కేటాయించారు. ఎస్-25 గదిని లీగల్ మెట్రాలజీ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, స్టాఫ్కు కేటాయించారు. ఎస్-26 గదిని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పంచాయతీరాజ్ శాఖ అధికారి, స్టాఫ్కు, ఎస్-27 గదిని ఏడీ, గ్రౌండ్ వాటర్ అధికారి చాంబర్, స్టాఫ్కు, ఎస్-28 గదిని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్కు కేటాయించారు. నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) నుంచి పూర్తి స్థాయిలో పరిపాలన సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ సీహెచ్శివలింగయ్య అధికారులతో కలిసి ఇక్కడి నుంచే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలో ‘గ్రీవెన్స్ సెల్’ ప్రజలకు అందుబాటులోకి రానుంది.