వారి మాటలకు యువత, నిరుద్యోగులు బలికావొద్దు
టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయుకుడు వీరేందర్
హన్మకొండ, ఏప్రిల్ 4: బీజేపీ నాయకుల వ్యాఖ్యలతోనే యువత, నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకుడు బీ వీరేందర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదివారం హన్మకొండలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రభుత్వం దాదాపు లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. అదేవిధంగా 50 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జీవోను కూడా విడుదల చేసిందని పేర్కొన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు, యువత బీజేపీ నాయకుల రెచ్చగొట్టే మాటలకు బలికావొద్దని, ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాల కోసం సన్నద్ధం కావాలని ఆయన కోరారు. ఎల్ఐసీ, రైల్వే, బీఎస్ఎన్ఎల్తోపాటు అనేక సంస్థలను కేంద్రప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తూ ఆయా సంస్థల ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు అందకుండా కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ చేయడంతో వారికి రిజర్వేషన్లు లేకుండా చేయాలనే కుట్ర కూడా చేస్తుందని అన్నారు.
ఇప్పటికైనా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకొని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం కాకుం డా చేసి అందులో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా మోదీతో పోరాడాలని హితవు పలికా రు. మీ రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే బోడ సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడని, దీనికి పూర్తి బాధ్యత బీజేపీ నాయకులే వహించాలన్నారు. యువతను, నిరుద్యోగులను అడ్టుపెట్టుకొని రాజకీయ లబ్ధి కోసం వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా మీరు రెచ్చగొట్టే మానుకోకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను కలుపుకొని బీజేపీ కార్యాలయం, పార్టీ నాయకుల ఇళ్లపై దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏనాడో జోనల్ వ్యవస్థను సిద్ధం చేసి కేంద్రానికి పంపించిందని, ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం ఆమోదించకుండా గ్రూప్-1, 2 ఉద్యోగాల నియామకాలు జరుగకుండా అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో కేయూ విద్యార్థి యువజన నాయకుడు, కుడా డైరెక్టర్ చిర్ర రాజుగౌడ్, టీఆర్ఎస్వీ యువజన నాయకులు మేడారపు సుధాకర్, పీ కొమురయ్య, టీఆర్ఎస్వీ కేయూ ఇన్చార్జి జెట్టా రాజేందర్, జిల్లా కో ఆర్డినేటర్ మోతె రాజు, కేయూ నాయకులు ఎస్ విష్ణువర్ధన్, అనిల్, దీపక్, అభిషేక్, ఎం మనోజ్, జగ్గుల వినోద్, సాయిరాం, రమేశ్ నాయక్, మణికంఠ, గణేశ్, నాగరాజు, నవీన్, తిరుపతి, ఆర్ ప్రవీణ్, మొగిలి పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
బెంగాల్ స్వీట్ షాప్లో.. మమత, మోదీ
హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తామన్న అజ్జూ భాయ్