స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 29 : జిల్లాలో వలస కూలీలకు ఉపాధి లభిస్తోం ది. యూపీ, ఆంధ్రా నుంచి వచ్చిన వలస కూలీలు వ్యవసాయంలో ఉపాధి పొందు తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రైతులు దగా పడ్డారు. సాగునీటితో పాటు సరిపడా విద్యుత్ లేక ఇబ్బందులు పడ్డారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముం దుచూపుతో దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగలా చేశారు. వ్యవసాయానికి 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు. పలు ప్రాజెక్టుల ని ర్మాణంతోపాటు మిషన్ కాకతీయ ద్వారా సమృద్ధిగా వ్యవసాయానికి సాగునీరు లభిస్తోంది. యాసంగిలో సైతం చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండు కుండలను తలపిస్తున్నాయి. దీంతో జిల్లాలో బీడు భూములు సైతం సాగు భూములుగా మా రాయి. దీనికి తోడు రైతు బంధు, రైతు బీమా పథకాలు రైతుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఈ క్రమంలో దండుగ అనుకున్న వ్యవసాయం నేడు పండుగలా మారింది. సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో నేడు కూలీలకు సైతం విపరీతంగా డిమాం డ్ పెరిగింది. సకాలంలో నాట్లు వేయించేందుకు రైతులు కూలీలకు గుత్తకు ఇస్తున్నారు. ప్రస్తుతం ఎకరానికి రూ.ఆరు వేల వరకు తీసుకుని నాట్లు వేస్తున్నారు. సొంత గ్రా మాల్లో కూలీలు దొరక్క పక్క గ్రామాల నుంచి ఆటోలు, ట్రాలీలలో రైతులను తీసుకువచ్చి నాట్లు వేయిస్తున్నారు. ఇతర రాష్ర్టా ల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఒరిస్సా, ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీలు ఇక్కడికి వలస వచ్చి నాట్లు వేస్తున్నారు.
ఇతర గ్రామాల కూలీలు..
మాకు ఆరు ఎకరా ల పొలం ఉంది. వి ద్యుత్తోపాటు సాగునీటి సౌకర్యం ఉండడంతో ప్రస్తుతం ప్రతి ఎకరం సాగులోకి వ చ్చింది. నాటు వేయడానికి కూలీలు దొ రకడం లేదు. గుత్తకు ఎకరానికి ఆరు వే లు అంటున్నారు. ఇతర గ్రామా ల నుం చి కూలీలను ఆటో, ట్రాలీల్లో తీసుకువచ్చి నాట్లు వేయిస్తున్నాం. కూలీల స మస్య పరిష్కారానికి వరినాటు యం త్రం తీసుకోవాలని ఆలోచిస్తున్నాం.
– సట్ల సురేశ్గౌడ్, రైతు, రంగరాయగూడం
తెలంగాణ ప్రభు త్వం వచ్చాక సాగు వి స్తీర్ణం పెరిగింది. దీం తో కూలీల కొరత ఏ ర్పడింది. రానున్న రో జుల్లో నాటు వేయడానికి కూలీలు దొరకరు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న దళిత బంధు పథకంలో చాలా మంది ట్రాక్టర్లు, డోజ ర్లు తీసుకుంటున్నారు. కానీ వరినాటు యంత్రం, వరికోత యంత్రాలు తీసుకుంటే వారికి ఉపాధి దొరుకుతుంది.
– రమేశ్, వరికోత మిషన్ ఓనర్
మాకు మూడు ఎ కరాల భూమి ఉంది. నాటు వేయడానికి కూలీలు దొరకడం లే దు. దీంతో నారు ము దిరిపోతుందని, నా టు ఆలస్యం అవుతుందని చుట్టు పక్క రైతులం కలిసి వంతుల వారీగా నాటు వేసుకుంటున్నాం. గత నాలుగేళ్లుగా కూలీల సమస్య ఎక్కువైంది.
– రజిత, రైతు, ఇప్పగూడం
మాది చిల్పూరు మండలం నష్కల్ గ్రా మం. నేను గ్రామ ఉ పసర్పంచ్ని. నా వరికోత మిషన్తో ఆం ధ్రాలో వరి కోతలు చే పట్టేవాడిని. ఆ సమయంలోనే అక్కడ మగవారు సైతం నాటు వేస్తారని తెలుసుకున్నాను. నాలుగేళ్ల క్రితం 20 మందితో ఒక టీం తీసుకువచ్చాను. ఆంధ్ర వాళ్లే కాకుండా ఉత్తరప్రదేశ్కు చెందిన వారు కూడా నా ఆధ్వర్యంలో కూలీగా పని చేస్తున్నారు. ఇప్పుడు సుమారు 350మంది నా చేతికింద పని చేస్తున్నా రు. రైతులు ఫోన్ చేస్తే కూలీలను పంపిస్తున్నాను. ఎకరానికి గుత్తకు రూ.6వేలు తీసుకుంటున్నాం.
– చిర్ర రాజుగౌడ్, యూపీ టీంలకు మధ్యవర్తి