సాదాసీదాగా మండల సభ
రఘునాథపల్లి ఆగస్టు 23: మండల సర్యసభ్య సమావేశం సోమవారం సాదాసీదాగా జరిగింది. మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ హాల్లో నిర్వహించిన సమావేశానికి ఎంపీపీ మేకల వరలక్ష్మి అధ్యక్షత వహించారు. తొలుత పీహెచ్సీ ఆధ్వర్యంలో కరోనాపై నిర్వహించిన కార్యక్రమాలను చదివి వినిపిస్తుండగా రఘునాథపల్లి ఎంపీటీసీ పేర్నే ఉషా, వెల్ది సర్పంచ్ కొయ్యడ మల్లేశ్ కలుగజేసుకుని దవాఖానకు రాలేక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటివద్ద టీకాలు ఇవ్వాలని కోరగా, దవాఖానలో టీకా ఇస్తే వైద్యుల సమక్షంలో పేషంట్ ఉంటాడని వైద్యాధికారి స్రవంతి తెలిపారు. అనంతరం పశువైద్యాధికారి నివేదికను వినిపిస్తుండగా సభ్యులు గొర్రెల యూనిట్లను సకాలంలో అందించాలని కోరారు. మండలానికి వచ్చిన నిధులను ఎంపీపీ తన కు నచ్చిన ఎంపీటీసీలకే ఇస్తున్నారని టీఆర్ఎస్ ప్రజాత్రినిధులకు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ జడ్పీటీసీ అజయ్కుమార్, ఎంపీటీసీలు సభకు హాజరు కా లేదు. దీనికితోడు పలు శాఖల అధికారు లు గైర్హాజరు కావడంతో సభను ముగించారు. అనంతరం ఇటీవల ఉత్తమ అధికారులుగా అవార్డులు పొందిన జనగామ రూరల్ సీఐ వినయ్కుమార్, ఎస్సై రాజేశ్నాయక్, తహసీల్దార్ బన్సీలాల్కు ఎంపీపీ, ఎంపీటీసీలు సన్మానించారు. సమావేశంలో ఎంపీడీవో ఆసీం, పశువైద్యాధికారి నటరాజ్, ఎంఈవో జయసాగర్, వ్యవసాయ అధికారి శ్రీనివాస్రెడ్డి, ఏపీఎం సారయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
తరిగొప్పులలో..
తరిగొప్పుల: మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో ఎంపీపీ జొన్నగోని హరిత అధ్యక్షతన మండల సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్లు మాట్లాడుతూ.. గ్రామాల్లో విద్యుత్లైట్లు వెలుగడం లేదని, వాటికి మరమ్మతులు చేయించాలని కోరారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను సకాలంలో మంజూరు చేయాలని పేర్కొన్నారు. అనంతరం పలు సమస్యలపై చర్చించారు. సమావేశంలో ఎంపీడీవో ఇంద్రసేనా రెడ్డి, తహసీల్దార్ మహ్మద్ ఫరీదొద్దీన్, వైస్ ఎంపీపీ చెన్నూరి సంజీవ, ఎంపీటీసీలు ఏ మధుసూదన్రెడ్డి, భూక్యా జూంలాల్నాయక్, తుపాకుల మంగ, కో ఆప్షన్ నంబర్ ఏరువ ఇన్నమ్మ, దామెర ప్రభుదాస్, సర్పంచ్లు ముక్కెర బుచ్చిరాజ్యాదవ్, బెల్లపు రాజు, అమిరిశెట్టి వీరేందర్, భూక్యా రవి, తిరుపతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.