పాలకుర్తి రూరల్, అక్టోబర్ 13: మండలంలో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని అధికారులు, వైద్యాధికారులకు అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం కొవిడ్ వ్యాక్సినేషన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావడం అభినందనీయమన్నారు. వైద్య సిబ్బంది విధులపై అలసత్వం వహించొద్దని, వారం రోజుల్లో అన్ని గ్రామాల్లో వంద శాతం టీకాలు పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలన్నారు. సమీక్షలో ఆయన వెంట ఎంపీప నల్ల నాగిరెడ్డి, వైద్యాధికారులు ప్రియాంక, యామిని, కొడకండ్ల మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు ఉన్నారు.
వ్యాక్సినేషన్ తీసుకునేలా చర్యలు చేపట్టాలి..
బచ్చన్నపేట : కరోనా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జడ్పీసీఈవో విజయలక్ష్మి సూచించారు. మండలంలో ని కేసీరెడ్డిపల్లిలో నిర్వహించిన వ్యాక్సినేషన్ను ఆమె బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇప్పటి వరకు ఎంత మందికి వ్యాక్సినేషన్ చేశారు. వేసుకోని వారు ఎంత మంది ఉన్నారని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కరోనా వాక్సినేషన్ పూర్తి చేసి కరోనా రహిత మండలంగా తీర్చిదిద్దాలన్నారు. వైద్య సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
కొడకండ్ల: 18 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఎంపీడీవో రమేశ్ అన్నారు. బుధవారం మండలంలోని పెద్దబాయి తండా పంచాయతీలోని ఇం టింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని తెలిపారు. అదే విధంగా మండలంలోని హక్యతండాలో మండల పంచాయతీ అధికారి హరిప్రసాద్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేవరుప్పుల: మండలంలోని ధరావత్ తండా, బంజార గ్రామాల్లో నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సినేషన్ను బుధవారం ఎంపీడీవో ఉమామహేశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండాల్లో గిరిజనులు టీకాలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారని, వారిలో అవగాహన కల్పించి టీకాలు వేస్తున్నట్టు తెలిపారు. అవసరమైతే పోలీసుల సాయంతో వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి అభిజ్ఞరెడ్డి, ఎంపీవో కవికుమార్, ఆయా గ్రామాల సర్పంచ్లు బానోత్ గేమానాయక్, మాలోత్ కవిత, ఏఎన్ఎం సుజాన, విజయ, ఆశ కార్యకర్తలు విజయ, ఎలేంద్ర, యాకలక్ష్మి, సరిత, అనూష ఉన్నారు.
రఘునాథపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమి ఆరోగ్య కేంద్రంతో పాటు కోమాల్ల పీహెచ్సీలో బుధవారం 68 మందికి కరోనా పరీక్షలు నిర్వహించిన్నట్లు వైద్యాధికారులు స్రవంతి, మధుకర్యాదవ్ తెలిపారు. రఘునాథపల్లిలో ఐదుగురికి, కోమాల్లలో 63 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా టీకాలను తీసుకోవాలని సూచించారు.