ముదిరాజ్ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
జఫర్గఢ్, ఆగస్టు 12 : అంతరించి పోతున్న కుల వృత్తులను ఆదరించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజ య్య అన్నారు. గురువారం మండలంలోని కూనూరులో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పెద్దమ్మతల్లి ఆలయానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇల్లందుల కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ ముదిరాజ్ల సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీపై మోటార్ బైక్లు, వలలు అందించారని గుర్తు చేశారు. పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి సమష్టిగా కృషి చేస్తున్న ముదిరాజ్లకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఎంపీపీ రడపాక సుదర్శన్, వైస్ఎంపీపీ కొడారి కనుకయ్య, ఎంపీటీసీ చిరబోయిన సంధ్య, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గట్టయ్య, గ్రామాధ్యక్షుడు సంపత్, కొమురయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.