చిన్నగూడూరు, నవంబర్ 7 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయ క్ అన్నారు. మండలంలోని ఉగ్గంపల్లిలోని ఆయన స్వగృహంలో కురవి మండలం సీరోలు గ్రామానికి చెందిన కాం గ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ముడుసురాజు, సుకుమార్, విజయ్, బొల్లికొండ వెంకన్నతో పాటు మరో 50 మంది రెడ్యా సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రెడ్యా మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. దేశంలోనే కనీవిని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు అండగా నిలిచాడని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి పక్కా రోడ్లు, ప్రతి చెరువు, కుంటకు సాగునీరు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో నాయకులు బోజ్యానాయక్, మాజీ ఎంపీటీసీ మక్కల వెంకన్న, గ్రామశాఖ అధ్యక్షుడు మక్కల వీరన్న, నాయకులు వెంకన్న, వెంకన్న, టీఆర్ఎస్ కురవి మండల ఉపాధ్యక్షుడు మక్కల గోపన్న పాల్గొన్నారు.
పేదలకు అండ ‘సీఎంఆర్ఎఫ్’
పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్ నిలుస్తోందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మండలంలోని ఉగ్గంపల్లిలో సీరోలు గ్రామానికి చెందిన బొల్లికొండ చిన్న వెంకన్నకు మంజూరైన రూ.69,500తో పాటు పలు గ్రామాల వారికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను రెడ్యా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రతి కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు ఆయూబ్పాషా, టీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.