లింగాలఘనపురం, అక్టోబర్ 2: ఆడబిడ్డల సంక్షేమమే సర్కారు ధ్యేయమని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పేర్కొన్నా రు. మండలకేంద్రంలో శనివారం ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మండలంలో 15578 మందికి బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నామన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అన్ని రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వీరస్వామి, ఎంపీపీ చిటజ్లయశ్రీ ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి, నాయకులు బొల్లంపెల్లి నాగేందర్, బస్వగాని శ్రీనివాస్గౌడ్, దిశ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి,, దూసరి గణపతి, గండి యాదగిరి, అంతగల్ల రాంచందర్, కొత్తకొండ గంగాధర్, దాయ ఉపేందర్ , విండో చైర్మన్లు మల్గ శ్రీశైలం, ఉపేందర్గౌడ్, డైరెక్టర్లు ఆంజనేయులు, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఏఎస్ఆర్ గార్డెన్లో బతుకమ్మ చీరెల పంపిణీ
రఘునాథపల్లి : సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రాజయ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఏఎస్ఆర్ గార్డెన్లో శనివారం బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు, అనంతరం 73 మంది లబ్ధిదారుకలు కల్యాణలక్ష్మి, షాదీ మూబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బన్సిలాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా రాష్ట్రంలో 1.8 కోట్ల చీరెలను మహిళలకు అందించిన ఘనత టీ ఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ ఏడాది బతుకమ్మ చీరెల కోసం రూ. 333కోట్లు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొల్లం అజయ్కుమార్, ఎంపీ పీ మేకల వరలక్ష్మి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోకల శివకుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వారాల రమేశ్, మహిళా విభాగం అధ్యక్షురాలు తిప్పారపు మమత, నియోజకవర్గం ఇన్చార్జి మడ్లపల్లి సునిత, ఎంపీటీసీలు పీ ఉషా, కే రమ్య-రాజు,టీఆర్ఎస్ మండల కార్యదర్శి ముసిపట్ల విజయ్, నాయకులు నామాల బుచ్చయ్య, గొరిగె రవి, లొకుంట్ల సృజన్, హరీశ్గౌడ్, సర్పంచ్లు గుడి రాంరెడ్డి, బక్క యా దగిరి, జిట్టె వీరస్వామి, ఎంపీడీవో ఆసీం, తహసీల్దార్ బన్సీలాల్, ఏపీఎం సారయ్య, ఆర్ఐ స్వామి వివిధ గ్రామాల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
చిల్పూరులో..
చిల్పూరు: మండల కేంద్రంలోని శేషాద్రి ఫంక్షన్ హాల్లో మహిళలకు బతుకమ్మ చీరెలను స్థాని క ఎమ్మెల్యే తాటికొండ రాజ య్య పంపిణీ శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీ సరిత, సర్పంచ్ ఉద్దెమరి రాజ్కుమార్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు భూక్యా రమేశ్ నాయక్, నియోజకవర్గ కోఆర్డినేటర్ పోలెపల్లి రంజిత్ రెడ్డి, బాలరాజు, వెంకటస్వామి, రాజన్ బాబు, రమేశ్, డీఆర్డీవో రాంరెడ్డి, ఎంపీడీవో వేణుగో పాల్రెడ్డి, తహసీల్దార్ యాకన్న టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.