ములుగురూరల్, మే 22 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కడిగిన ముత్యం లాంటి ఏనుగుల రాకేశ్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ములుగు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఉప ఎన్నిక సన్నాహక సమావేశం జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా జనగామ, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు పల్లా, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారన్నారు.