హనుమకొండ చౌరస్తా, జూన్ 26 : కేయూ బయో టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో యూకే వేల్స్ గ్రూప్ అబెర్స్విత్ యూనివర్సిటీ సహకారంతో ‘ప్లాంట్ బయో టెక్నాలజీ అండ్ జీనోమ్ ఎడిటింగ్’ అనే అంశంపై ఈనెల 27 నుంచి 29 వరకు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తునట్టు వైస్ చాన్స్లర్ ఆచార్య తాటికొండ రమేశ్ తెలిపారు. సోమవారం సెనేట్ హాల్లో ఆయన మాట్లాడుతూ.. మూడురోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ సదస్సులో 8 దేశాల నుంచి శాస్త్రవేత్తలు పాల్గొంటారని, అబెర్స్విత్ యూనివర్సిటీ ఆచార్యులు హ్యూజోన్స్, లూయిస్ మూర్, డైలాన్ ఫిలిఫ్స్, ఆస్ట్రేలియా ముర్డాక్ యూనివర్సిటీ ఆచార్యులు ఎంజీకే జోన్స్ హాజరవుతున్నట్లు తెలిపారు.
మొదటి రోజు ముఖ్యఅతిథిగా వైస్ చాన్స్లర్ రమేష్, విశిష్ట అతిథులుగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ముఖ్య కార్యదర్శి నవీన్మిట్టల్ విచ్చేస్తారని, అమెరికాలోని జాన్ హాపిన్స్ యూనివర్సిటీ ఆచార్యులు శ్రీనివాసన్ చంద్రసేగరాన్ కీలక ఉపన్యాసం చేస్తారని చెప్పారు. గౌరవ అతిథులుగా మలేషియా యూనివర్సిటీ అఫ్ మలయా ఆచార్యులు జెన్నిఫర్ అన్న హరికృష్ణ, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ ఆచార్యులు ప్రకాష్ పీ కుమార్, హైదరాబాద్ ఐసీఏఆర్ సంచాలకులు ఆచార్య ఆర్ఎం సుందరం, రిజిస్ట్రార్ ఆచార్య శ్రీనివాసరావు పాల్గొంటారని తెలిపారు.
సదస్సుకు ఛైర్మన్గా ఆచార్యులు సదానందం, కో-చైర్మన్గా ఆచార్య రామస్వామి, కన్వీనర్లుగా ఏవీ రావు, శ్రీనివాస్, శాస్త్రీ వ్యవహరిస్తారని తెలిపారు. మొత్తం 8 ప్లీనరీ లెక్చర్ సెషన్లు ఉంటాయని, ఒకొక సెషన్లో ముగ్గురు స్పీకర్లు ఉంటారని, ఇక్రిసాట్, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజ్మెంట్, సీసీఎంబీ, నాబీతో పాటు హైదరాబాద్ యూనివర్సిటీ, సావిత్రీబాయి ఫూలే యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, బెంగళూరు యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ ఆచార్యుల ప్లీనరీ లెక్చర్లు ఉంటాయని పేర్కొన్నారు.
బయో టెక్నాలజీ, జీనోమ్ ఎడిటింగ్, బోటనీ, జంతుశాస్త్రం, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, మైక్రోబయాలజీ, ఫార్మసీ నుంచి 120 పరిశోధనా పత్రాలు సమర్పిస్తారని చెప్పారు. బెస్ట్ పోస్టర్, బెస్ట్ ఓరల్ ప్రజెంటేషన్లకు బహుమతులు అందజేస్తామని, ఆచార్య జోన్స్తో ప్రత్యేక ముఖాముఖి సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సదస్సుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి, రుసా, సెర్బ్, డీఎస్టీసీఎస్ఏఆర్, బెంగుళూర్ మదర్ బయోటెక్ ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.