ఖమ్మం సిటీ, నవంబర్ 2 : విద్యార్థులు, యువత ఆటలపై ఆసక్తి పెంచుకుంటే పోటీతత్వంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందని కేయూ రిజిస్ట్రార్ పీ మల్లారెడ్డి అన్నా రు. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి ఇంటర్ జిల్లా అథ్లెటిక్స్ పోటీలను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ క్రీడలతో దేశ ప్రతిష్ట సైతం పెరుగుతుందనే వాస్తవాన్ని ప్రతి క్రీడాకారుడు గమనించాలన్నారు.
కేయూ పరిధిలో నిర్వహిస్తున్న క్రీడల విజయవంతానికి పలు రకాల కమిటీలు వేసి మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. కేయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి వెంకయ్య ఇప్పటి వరకు మూడు దశల్లో నిర్వహించిన పోటీల్లో దాదాపు వేయి మం దికి పైగా క్రీడాకారులు తమ ప్రతిభను చాటి వెలుగులోకి వచ్చారని రిజిస్ట్రార్ వెల్లడించారు. కార్యక్రమానికి ఖమ్మం యూపీసీఈ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ రవికుమార్ అధ్యక్షత వహించగా జిల్లా యువజన, క్రీడల అధికారి టీ సునీల్రెడ్డి, కేయూ పీడీల సంఘం కార్యదర్శి డాక్టర్ బీ వెంకన్న, పీ శ్రీనివాస్, కోటి, అథ్లెటిక్స్ కోచ్ ఎండీ గౌస్, కార్యదర్శి ఎండీ షఫీ, పీడీలు శ్రీనివాస్రెడ్డి, రఘునందన్, ఏటీబీటీ ప్రసాద్, జే ఉపేందర్, సావిత్రి, లక్ష్మీకాంత్, సుధాకర్ పాల్గొన్నారు.