సుబేదారి, ఏప్రిల్ 26 : హైటెక్యుగంలో సోషల్మీడియా యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ముఖ్యంగా కొందరు అమ్మాయిలు ఈ విషపు వలలో త్వరగా పడిపోయి, తేరుకొనే లోపే వారి జీవితాల్లో అంధకారం అలుముకుంటున్నది. సోషల్ మీడియా చాటింగ్ యాప్ల ద్వారా కొందరు కేటుగాళ్లు అమాయక యువతులు, మైనర్లకు చేరువై ట్రాప్లోకి దింపి, మాయమాటలతో నమ్మించి, ఆ తర్వాత బ్లాక్ మెయిల్, ఆర్థిక దోపిడీ, లైంగిక వేధింపులతో అందమైన జీవితాలను చీకట్లోకి నెడుతున్నారు. డిజిటల్ యుగంలో ప్రేమ ముసుగులో జరుగుతున్న ఈ ఆకృత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
సోషల్ మీడియా ప్రభావంతో కొంతమంది అమ్మాయిలు దారి తప్పుతున్నారు. తెలిసీ తెలియని వయసులో స్మార్ట్ ‘ట్రాప్’లో పడి జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. అపరిచిత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరుచుకొ ని.. శారీరక బంధాలతో ‘బందీ’ అయి మానసికంగా కుంగిపోతున్నారు. ఉన్నతంగా ఎదగాల్సిన వయసులో లవ్ అట్రాక్షన్లో పడి ప్రేమించిన వ్యక్తి వ్యవహారశైలిని తెలుసుకోకుండానే మోసపోతున్నారు. డిజిటల్ జనరేషన్లో స్మార్ట్ ఫోన్ల వినియో గం తప్పనిసరిగా మారింది. ఇది కొంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నది. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళల మిస్సింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోజుకు సగటున 10నుంచి 20 ఫిర్యాదులు వస్తున్నాయి.
వీటిలో అ మ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. 16 నుంచి 25 ఏళ్లలోపు వాళ్లతోపాటు కొందరు మైనర్లు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. స్మార్ట్ ఫోన్లో వాట్స ప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ద్వా రా అపరిచితులతో పరిచయాలు ఏర్పరుచుకొని, ఉన్నత చదువులకు స్వస్తి చెప్పి, ఏమీ ఆలోచించకుండా నెల, రెండు, మూడు నెలల్లోనే ప్రేమ పేరు తో శారీరక బంధాలకు లొంగిపోయి.. కన్నవాళ్లను కాదని ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ప్రేమించిన వ్యక్తి అస లు రూపం తెలుసుకొని, మోసపోయామని ఇంటి దారిపడుతున్నారు. అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ చూపకపోవడం, స్మార్ట్ ఫోన్ ఎంతమేరకు అవసరం, పిల్లలు ఎవరితో మా ట్లాడుతున్నారు, సోషల్మీడియాలో ఎవరితో కనెక్ట్ అవుతున్నారనే విషయంలో దృష్టిపెట్టకపోవడంతో ఇలాం టి ఘటనలు నిత్యం జరుగుతున్నాయి.
అమ్మాయిలు, అబ్బాయిలతో తల్లిదండ్రులు ఫ్రెండ్లీగా ఉండాలి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న అమ్మాయిలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టుకోవాలి. కొత్త వ్యక్తులతో మాట్లాడుతున్నపుడు వారి మానసిక పరిస్థితి, కండిషన్ ఎలా ఉందని గమనించాలి. చెడు స్నేహాలపై దృష్టి పెట్టాలి. అబ్బాయిల విషయంలో కూడా అలాగే ఉండాలి. ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం కొంత సమయం కేటాయించాలి. ఓపెన్గా మాట్లాడాలి. వారి ఇష్టాలను తెలుసుకోవాలి. ఎవరినైనా ఇష్టపడుతున్నట్లు తెలిస్తే, భవిష్యత్ రీత్యా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ట్రాప్లో పడి, పొరపాట్లు జరిగి, బ్లాక్ మెయిల్కు గురైనా, లేదా తప్పు జరిగినపుడు వెంటనే మానసిక ధైర్యం చెప్పి, భవిష్యత్ను చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. బాధలో ఉన్నప్పుడు కుంగిపోయేలా ఇబ్బంది పెట్టొద్దు. టెక్నాలజీ జనరేషన్లో ఎలాంటి తప్పులు, నేరం చేసినా చట్టరీత్యా శిక్షించబడి, భవిష్యత్ పాడవుతుందని అబ్బాయిలకు హెచ్చరికగా చెప్పాలి.
– దార కవిత, సెంట్రల్ జోన్ డీసీపీ (వరంగల్ పోలీసు కమిషనరేట్)