కొత్తగూడ, ఆగస్టు 24 : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలోని పాకాల అభయారణ్యంలో అరుదైన ఉడుత కనిపించింది. స్థానిక గుంజేడు ముసలమ్మ ఆలయానికి వచ్చిన భక్తులకు ఓ చెట్టుపై పాకుతూ ఇది కనిపించగా వారు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
తొలుత దాని ఫొటోను చూసిన వారు పునుగు పిల్లి అని భావించినప్పటికీ అది ఉడుతల్లో అరుదైన జాతి అని ఎఫ్ఆర్వో వజాయిద్ తెలిపారు. కాగా ముదురు ఎరుపు, నలుపు రంగులు కలగలిపి ఉన్న ఉడుతను ఇండియన్ జెయింట్ స్కిరెల్ అని కూడా పిలుస్తారని తెలుస్తున్నది.