వరంగల్ లీగల్ , మార్చి 31 : న్యాయవాద సంఘం ఎన్నికల్లో వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఈ ఆనంద్ మోహన్, హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వై శ్యాం సుందర్రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన హోరాహోరీ ఎన్నికల్లో న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వరంగల్ బార్ అసోసియేషన్లో 723 మందికి 484 మంది మాత్రమే ఓటు హ కు వినియోగించుకోగా, హనుమకొండలో 803 మందికి 709 న్యాయవాదులు ఓటు వేశారు. ఇప్పటివరకూ ఉమ్మడి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఈ ఆనంద్ మోహన్ తిరిగి అనూ హ్య విజయం సాధించారు.
తన సమీప ప్రత్యర్థి రాఘవరావుపై విజయం సాధించగా, ప్రధాన కార్యదర్శిగా పసుల యాకస్వామి తన సమీప ప్రత్యర్థి ముదస్సిర్పై గెలుపొందారు. అలాగే, ఉ పాధ్యక్షుడిగా ఆనంద్రావు, కోశాధికారిగా అమృతరావు, సంయుక్త కార్యదర్శిగా బీ శ్రీనివాస్, సీనియర్ కార్యవర్గ సభ్యులుగా ఈ వేణుగోపాల్ ఎన్నికయ్యారు. నూతనంగా ఏర్పాటైన వరంగల్ బార్ అసోసియేషన్ కార్యవర్గం కోసం జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సంయుక్త కార్యదర్శిగా పీ శ్రీనివాస్, మహిళా సంయుక్త కార్యదర్శిగా ఏ కవిత, సాంసృతిక కార్యదర్శిగా జీ వెంకటరమణ, సీనియర్ ఈసీ మెంబర్లుగా ఎస్ శ్రీనివాస్, పీ పద్మావతి, జగదీశ్వర్, కే పూర్ణచందర్, బీ రమేశ్, శేషాచార్యులు, ఎస్ అరుణ ఎన్నికయ్యారు. అదే విధంగా హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వై శ్యాంసుందర్రెడ్డి తన సమీప ప్రత్యర్థి మాతంగి రమేశ్బాబుపై విజయం సాధించారు. ప్రధాన కా ర్యదర్శిగా గొంగిడి శ్రీధర్రెడ్డి తన సమీప ప్రత్యర్థి శివప్రసాద్పై గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా దయాన్ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా చల్లా శ్రీనివాసన్, కోశాధికారిగా అండాలు, సాంసృతిక కార్యదర్శిగా విజేందర్, మహిళా సంయుక్త కార్యదర్శిగా ఇందిరావిశాలి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యుడిగా నునావత్ రమేశ్నాయక్ అత్యధిక మెజార్టీతో ఎన్నికయ్యారు. కాగా, నూతన కార్యవర్గం శుక్రవారమే ప్రమాణ స్వీకారం చేసింది.