హనుమకొండ చౌరస్తా, మార్చి 20: ప్రతి జిల్లాలో క్రికెట్ మైదానాలు ఏర్పాటు చేస్తామని, మొదటిది వరంగల్లోనే ప్రారంభిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ప్రెసి డెంట్, తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్రావు అన్నారు. హ్యాండ్బాల్ అసోసియేషన్ జనరల్బాడీ మీటింగ్, ఎన్నికలు బుధవారం హనుమకొండలో జరిగాయి. ముఖ్య అతిథిగా జగన్మోహన్రావు పాల్గొని మాట్లాడుతూ క్రికెట్, హ్యాండ్బాల్ తనకు రెండు కళ్లలాంటివని, హ్యాండ్బాల్ స్ఫూర్తితో క్రికెట్కు వచ్చానన్నారు. గొప్ప క్రీడాకారులు వరంగల్లో ఉన్నారని, ఇక్కడ ఉన్న శాట్ హాస్టల్ను తరలిపోకుండా చూస్తానన్నారు. త్వరలో వరంగ ల్లో స్పోర్ట్స్, క్రికెట్ క్లబ్ పెట్టేందుకు విధివిధానాలను రూపొందించాలని ఆయన అసోసియేషన్ నాయకులను కోరారు.
ఏప్రిల్, మేలో వరంగల్లో 200 మంది క్రీడాకారులను ఎంపిక చేసి హైద రాబాద్ ఉప్పల్ స్టేడియంలో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. త్వరలో క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడాకారులకు అక్షర గ్రూప్ ద్వారా తన వంతుగా సహాయసహకారాలు అందిస్తానన్నారు. ఈ సందర్భంగా హ్యాండ్బాల్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావును జగన్మో హన్రావు అభినందించారు. అనంతరం ఏప్రిల్ 25 నుంచి 27 వరకు ఖిలావరంగల్లో జరిగే ఫస్ట్ తెలంగాణ హ్యాండ్బాల్ ప్రీమియర్ లీగ్ పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాకతీయుల కళాతోరణంతో కూడిన జ్ఞాపికను జగన్మోహన్రావుకు అందజేశారు. కార్యక్రమంలో ఒలింపిక్స్ ఉమ్మడి వరంగల్ అధ్యక్షుడు మహమ్మద్ అజీజ్ఖాన్, కార్యదర్శి కైలాస్యాదవ్, అథ్లె టిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి, హెచ్సీఏ వరంగల్ అధ్యక్షుడు చాగంటి శ్రీనివాస్, బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.
హ్యాండ్బాల్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఇండ్ల నాగేశ్వర్రావును ఎన్నుకున్నా రు. కార్యదర్శిగా బొడ్డు విష్ణువర్ధన్రెడ్డి, కోశాధికారిగా నరేందర్బాబు, చైర్మన్గా ప్రభాకర్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా పోగుల అశోక్, జాయింట్ సెక్రటరీగా అశోక్, సభ్యులుగా సంతోష్, శ్రీధర్, చంద ర్, వీరస్వామిని ఎన్నుకున్నట్లు తెలిపారు.