హనుమకొండ చౌరస్తా, జూన్ 28: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎస్సార్ విద్యా సంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారని చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపా రు. మంగళవారం హనుమకొండ కాకాజీకాలనీలో ఎస్సార్ గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఆయన డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోశ్రెడ్డితో కలిసి మాట్లాడారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన తో విద్యార్థులు ర్యాంకులు సాధించారని తెలిపారు. బైపీసీలో ఎం.కిరుబా ఇన్గ్రిడ్ 992 మార్కులు, జి.సాయిప్రియ 990, మలిహా ముస్కాన్ 990, ఎంపీసీలో యు.రచితసాయి 991, ఎం.చంద్రిక 991, వి.భావన 991, జి.మురళీ 991, జి.రుత్విక్ 991, డి.పూజితరెడ్డి 991, ఎంఈసీలో ఏ.ఖుషి 983, సీఈసీలో బి.హర్షిక 979 మార్కులు సాధించారు.
మొదటి సంవత్సరం ఎంపీసీలో 467/470 మార్కులు 36 మందికిపైగా, 466/470 156 మందికిపైగా, 465/470 570 మందికిపైగా, బైపీసీలో 437/440 9మందికిపైగా, 436/440 76 మందికిపైగా, 435/440 360 మందికిపైగా, సీఈసీలో నిషాదామిర 491, ఎంఈసీలో జి.సాహిత్, బి.నగర్షిత 492 మార్కులు సాధించినట్లు వివరించారు.
చాలా ఆనందంగా ఉంది
ఎంపీసీలో 991 మార్కులు సాధించడం చాలా ఆనందం గా ఉంది. క్రమశిక్షణ, టైంటేబుల్ ప్రకారం కష్టపడి చదివాను.
– జి.రుత్విక్, ఎంపీసీ విద్యార్థి
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..
తల్లిదండ్రులు, అన్న ప్రోత్సాహంతో ఎంపీసీలో 991 మా ర్కులు సాధించా. ఇంజినీర్ కావాలనేది నా లక్ష్యం.. వజ్ఞులైన అధ్యాపకులతో విద్యా బోధన అందించారు.
– పూజితరెడ్డి, ఎస్సార్ విద్యార్థిని