హసన్పర్తి, జూన్ 28 : ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రతిభ చూపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో హసన్పర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థిని కొర్రె మేఘనా సింధు ఎంపీసీలో 990, ఏ తేజ దీప్తి 977, బొంతు సుస్మిత 821, సీఈసీలో బుర్ర రక్షిత 930 మార్కులు సాధించారు. అలాగే, ప్రథమ సంవత్సరం ఎంపీసీలో జే కల్యాణ్రామ్ 450, ఎం వైష్ణవి 425, బైపీసీలో టీ రమ్య 401, వీ చందన 436 మార్కులు సాధించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమప్రతిభ చూపిన కొర్రె మేఘనా సింధుతోపాటు విద్యార్థులను ప్రిన్సిపాల్ సునీత, కాలేజీ కమిటీ బాధ్యులు చకిలం రాజేశ్వర్రావు, అధ్యాపకులు కుమార్, చాప్లా, కొమురారెడ్డి, సదానందం, రఘురామ్, హరిప్రసాద్, కమాలాదేవి, సాయి ప్రసాద్, సుమలత, సౌజన్య, కుమార్, రంజిత్, అనిత అభినందించారు.
హసన్పర్తి గురుకుల విద్యార్థులు..
ఇంటర్ పలితాల్లో హసన్పర్తిలోని తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపా రు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో జీ కావ్య 467, బైపీసీలో పీ వైష్ణవి 436, సోని కుమారి 436, ఎంఈసీలో అరుణ 488 మార్కులు సాధించగా ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో ఎన్ మాన్విక 986, బైపీపీలో నిరోష 988, ఎంఈసీలో స్వాతిక 977 మార్కులు సాధించారు. విద్యార్థినులను కూపిన్సిపాల్ బాలరాజు, అధ్యాపకులు అభినందించారు.
కమలాపూర్ కేజీబీవీలో..
కమలాపూర్ : మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ద్వితీయ సంవత్సరం బైపీసీలో వేముల వసుంధర 874, సముద్రాల అంజలి 874, మడిపెల్లి కీర్తిమ 864, ఎంపీసీ గాజుల రష్మిత 915, దుర్గం మానస 896 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో కావటి దివ్య 462, చేరాల సిరిసహాస్ర 455, బైపీసీలో బండి సంగీత 425, మునుకుంట్ల సౌమ్య 404 మార్కులు సాధించినట్లు ప్రత్యేకాధికారి అర్చన తెలిపారు.
పరకాల విద్యార్థుల ప్రతిభ
పరకాల : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో గాజుల హర్షిత 943 మార్కులు సాధించి డివిజన్ స్థాయిలో టాపర్గా నిలిచినట్లు ప్రిన్సిపాల్ కె.సంపత్కుమార్ తెలిపారు. అలాగే, మొదటి సంవత్సరం ఎంపీసీలో శ్రీవిద్య 442 మార్కులు సాధించగా, ఒకేషనల్ ఎంఎల్టీలో జీ మహేశ్వరి, పీ హర్షిని టాప్లో నిలిచినట్లు వివరించారు.
ఆత్మకూరులో..
ఆత్మకూరు : మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బయ్య కావ్య 792, వావిలాల పూజ 743, ఎండీ ఫిరోజ్ 736 మార్కులు సాధించగా ప్రథమ సంవత్సరంలో బింగి సాయిమేఘన 438, ఎస్డీ ఫర్జానా 369 మార్కులు, ఏరుకొండ కావేరికి 363 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ బండ నర్సింహారెడ్డి తెలిపారు. అలాగే, తిరుమలగిరిలోని కస్తూర్భాగాంధీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ వాసవి తెలిపారు.
మైనార్టీ గురుకుల విద్యార్థుల విజయకేతనం
దామెర : ఓగ్లాపూర్ ఎస్బిట్లోని పరకాల మైనార్టీ గురుకుల కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపినట్లు ప్రిన్సిపాల్ వై శ్రీలత తెలిపారు. సీఈసీ మొదటి సంవత్సరంలో కే శివరాజ్కుమార్ 478, ఎంఈసీలో ఎండీ అబూబకర్ 461, కే అనీల్ 460, బీ ప్రవీణ్కుమార్ 458 మార్కులు సాధించారు. ఈ మేరకు విద్యార్థులను ప్రిన్సిపాల్తోపాటు కోఆర్డినేటర్లు ఎండీ ఇక్బాల్, వినయ్, అడపరాజు, ఎండీ హరీఫ్పాషా, నగేవ్, ఎస్కే గోరిమియా, కుమారస్వామి, ఎండీ ఫర్హానా అభినందించారు.
శాయంపేట విద్యార్థులు..
శాయంపేట : శాయంపేటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రథమ సంవత్సరం బీపీసీలో ఎ.వర్షిణి 414, రహేనా 398, సీఈసీలో శివసాయి 407, శ్రావణి 376 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం బీపీసీలో తేజస్వీ 868, నిచితకు 781, ఎంపీసీలో శివకుమార్ 717, గణేశ్ 574 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ శ్రీధర్ తెలిపారు. అలాగే, మండలంలోని మాందారిపేట శివారు కస్తూర్బాగాంధీ బాలికల కళాశాల విద్యార్థినులు ప్రథమ సంవత్సరం ఎంపీసీలో బీ శ్వేత 462, పీ శ్రావణి 429, ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో ఎం ప్రసన్న 905, బీపీసీలో పీ వైష్ణవి 973 మార్కులు సాధించినట్లు ప్రత్యేక అధికారి మాధవి తెలిపారు.