నయీంనగర్, ఆగస్టు 16 : అంతర్జాతీయ కాన్ఫరెన్స్లకు తెలంగాణ ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ (జేఎన్టీయూహెచ్) సంయుక్తంగా ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ఆపరేషన్స్ మెనేజ్మెంట్పై రెండో ఇండియన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆన్లైన్లో జరిగిన ఈ కాన్ఫరెన్స్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
విద్యావేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ ఆధారిత నిపుణులు తమ ఆలోచనలను మార్పిడీ చేసుకోవడానికి ఈ కాన్ఫనెన్స్ ఎంతగానో దోహదపడుతుందని వక్తలు చెప్పారు. కాన్ఫరెన్స్లో 25 దేశాల ప్రతినిధులు 650 కంటే ఎక్కువగా పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఇందులో ప్రచురణకు దాదాపు 400 పత్రాలను ఆమోదించారు. కాగా, మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు, హైదరాబాద్ జేఎన్టీయూ వైస్ చాన్సలర్ కట్టా నరసింహారెడ్డి, ప్రొఫెసర్ అహ్మద్ అలీ, కుమార్, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, ఐఈవోఎం రిజిస్ట్రార్ మంజూర్ కుత్బుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.