వరంగల్, జనవరి 12: గోవులకు సేవ చేయడం గోపాలమిత్రుల అదృష్టమని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావు అన్నారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గోపాలకృష్ణ విగ్రహాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం సంక్రాంతి సంబురాలను ప్రారంభించారు. తర్వాత జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు చింతకుంట్ల ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజేశ్వర్రావు మాట్లాడారు. గోపాలకృష్ణ పేరుతో గోపాలమిత్రలు ఉండడం సంతోషకరమన్నారు.
అనంతరం ఉత్తమ గోపాలమిత్రులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. వారి సేవలను ఆయన కొనియాడారు. నిట్ ప్రొఫెసర్ కృష్ణ ప్రభుజీ భగవద్గీత పారాయణం చేశారు. శ్రీకృష్ణుడి ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు శ్రీనివాస్ ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరులపై వివరించారు. పశుగణాభివృద్ధి సంస్థ జేడీ డాక్టర్ రఘుబాబు మాట్లాడుతూ ప్రతి ఇంట్లో పాడిపశువులు పెంచుకోవాలని కోరారు. మేలుజాతి దూడలు అందించాలనే లక్ష్యంతో పశుగణాభివృద్ధి సంస్థ పని చేస్తున్నదన్నారు.
కార్యక్రమంలో పశుగణాభివృద్ధి సంస్థ అధికారులు డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ వెంకటనారాయణ, డీఎల్డీఏ కార్యవర్గ సభ్యులు జనార్దన్రెడ్డి, డాక్టర్ దేవేందర్రావు, రత్నాకర్, సమ్మయ్య, రాధ, డాక్టర్ రవికుమార్, డాక్టర్ శ్రీనివాస్, గోపాలమిత్ర సూపర్వైజర్లు జైపాల్రెడ్డి, రాజేశ్వర్రావు, ప్రకాశ్రెడ్డి జహంగీర్, రఘువీర్, ఐలుమల్లు, అనిల్, గోపాలమిత్రలు, పాడి రైతులు, పశుమిత్రులు పాల్గొన్నారు.