నర్సంపేట, డిసెంబర్5: తన జీవితాంతం పోరాటమేనని, అధైర్య పడేది లేదని, ప్రజల్లోనే ఉంటానని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద ర్శన్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రజ ల తీర్పును గౌరవిస్తున్నానని అన్నారు. తన పని విధానంలో మార్పులు చేసుకోవాలని గమనించా నని పేర్కొన్నారు. ఉద్యమ కాలంలోనూ తాను ఓడిపోయానని, మొదటి అసెంబ్లీ సమావేశానికి ఎన్నిక కానిది తానొక్క ఉద్యమకారుడినేనని అ న్నారు.
ఐదేండ్లకోసారి వచ్చే నాయకుడిని ప్రజలు కోరుకుంటున్నారా అనేది చర్చ జరగాలన్నారు. నన్ను దెబ్బకొట్టడానికి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గానికి పథకాలను తెచ్చి నట్లు తెలిపారు. పాకాల, రంగాయ చెరువుల కింద కాల్వలు పూర్తి చేయాలని, పనులు చాలా పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఇప్పుడు గెలిచి న నాయకులు వాటిని పూర్తి చేయాలని కోరుతు న్నట్లు తెలిపారు. 20 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బ్రిడ్జిలను పోరాడి తెచ్చి ఇటీవలే శంకు స్థాపన చేసుకున్నామని, వాటిని కూడా పూర్తి చే యాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రాష్ట్ర స్థాయి గుర్తింపును తెచ్చాన ని, రైతులు, ప్రజలకు ఆపదలో, తుఫాను సమ యంలో కూడా అందుబాటులో ఉన్న తనకు ప్రజ లు ఈ స్థాయిలో తీర్పును ఇస్తారని ఊహించ లేద ని అన్నారు. తనకు రాజకీయాలు రావని, ఉద్య మ నేపథ్యం నుంచి వచ్చిన కాబట్టి కుట్రలు రావ న్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేద్దామని డిజైన్లు తయారుచేసి పెట్టుకున్నానని, కానీ ప్రజల తీర్పు వల్ల ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. నర్సంపేటను వదిలిపెట్టి తాను ఎప్పుడు బయట ఉన్నది లేదని అన్నారు. ఎప్పుడూ ప్రజలకు సేవ చేయడమే తెలుసని అ న్నారు. ఎమ్మెల్యే అంటే ఒక బాధ్యతగా ప్రజలు, కార్యకర్తల కోసం పనిచేశానని అన్నారు. హార్టిక ల్చర్ యూనిట్ కోసం ఫారెస్టు అధికారులతో కేసు ల పాలయ్యానని తెలిపారు.
పెద్ది సుదర్శన్రెడ్డి తెచ్చిన పనులు నేనెందుకు చేయాలని ఇప్పుడు గెలిచిన నాయకులు భావించకుండా ప్రజల కోస మైనా పనులు పూర్తి చేయాలని కోరారు. నర్సంపే టలో రూ. వందల కోట్ల నిధులు మంజూరు చేసి ఉన్నాయని అన్నారు. వాటిని ల్యాప్స్ చేయవద్దని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సంపూ ర్ణంగా సహకరిస్తానని పేర్కొన్నారు. సమావేశంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనా యక్, మార్కెట్ చైర్మన్ పొన్నం మొగిలి, రాయిడి రవీందర్రెడ్డి, గుంటి కిషన్, నల్లా మనోహర్రెడ్డి, మునిగాల వెంకట్రెడ్డి, కోమాండ్ల గోపాల్రావు, నామాల సత్యనారాయణ, దార్ల రమాదేవి, బండి రమేశ్, నాగిశెట్టి ప్రసాద్, కొమ్ము రమేశ్యాదవ్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.