కాళేశ్వరం, డిసెంబర్ 28 : లక్ష్మి (కన్నెపల్లి) పంపుహౌస్లో ఐదో మోటర్ను బుధవారం ఆన్ చేశారు. 15 రోజుల నుంచి 1వ, 2వ, 3వ, 4వ మోటర్లను ఆన్ చేసి నీరు తరలిస్తుండగా బుధవారం సాయంత్రం 5వ మోటర్ను ఆన్ చేసి 45 నిమిషాలు నడిపి అన్నారం(సరస్వతి) బరాజ్కు గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తరలించారు.
అలాగే ఈ నెల చివరికల్లా మరికొన్ని మోటర్లను ప్రారంభించనున్నట్లు రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈఎన్సీ వెంట ఎస్ఈ కర్ణాకర్, ఈఈ తిరుపతిరావు, డీఈ సత్యబాబు, ఏఈఈ భరత్ ఉన్నారు.