పాలకుర్తి రూరల్/ కొడకండ్ల/ రాయపర్తి, డిసెంబర్ 9 : ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు అధైర్య పడొద్దని.. పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధైర్యం చెప్పారు. శనివారం పాలకుర్తి, కొడకండ్ల, రాయపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ మంత్రిగా, ఎమ్మె ల్యే పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేకు ఆయన అభినందనలు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నా రు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు నూతన ప్రభుత్వం కృషి చేయాలని ఎర్రబెల్లి కోరారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతికి చోటు ఇవ్వలేదన్నారు. గెలిచినా, ఓడినా తాను ప్రజల మధ్య ఉంటానన్నారు.
వర్ధన్నపేటలో ఎమ్మెల్యేగా లేకున్నా పదేళ్లు ప్రజల మధ్య ఉన్నానని గుర్తు చేశారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాడుతానని, వచ్చే ఎన్నికల్లో విజ యం సాధించి ప్రజా సేవ చేస్తానన్నారు. సమావేశంలో జీసీసీ మాజీ అధ్యక్షుడు ధరావత్ మోహన్ గాంధీనాయక్, పాలకుర్తి ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్రావు, సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల అశోక్రెడ్డి, నాయకులు అడ్డూరి మాధవరావు, జర్పుల బాలునాయక్, కారుపోతుల వేణు, రాంరెడ్డి, డాక్టర్ మేడారపు సుధాకర్, బండి అయోధ్య, కమ్మగాని నా గన్న, తాడెం రవి, కటారి పాపారావు, వీరమనేని హనుమంతరావు, కాటబత్తిని రమేశ్, తిమ్మారావు, ఎడవెల్లి కృష్ణ, బెల్లి యుగేందర్, చిలుకమారి నాగేశ్వర్, మూ ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కొడకండ్లలో నిర్వహించిన సమావేశానికి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిందె రామోజీ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీపీ ధరావత్ జ్యోతి, జడ్పిటీసీ కేలోత్ సత్తెమ్మ, మార్కెట్ చైర్మన్ పేరం రాము, టీఎస్ ఈజీసీ సభ్యుడు అందె యాకయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పసునూరి మధుసూదన్, మాజీ జీ సీసీ చైర్మన్ గాంధీనాయక్, రైతుబంధు సమితి మండల అద్యక్షుడు దీకొండ వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. రాయపర్తిలో నిర్వహించిన సమావేశంలో మండల ఎన్నికల ఇన్చార్జి గుడిపూడి గోపాల్రావు, అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్ల సుధీర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కు మార్, రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య, నాయకులు పూస మధు, కుం దూరు రాంచంద్రారెడ్డి, జక్కుల వెంకట్రెడ్డి, గట్టు నర్సింహాచార్యులు, గబ్బెట బాబు, కర్ర రవీందర్రెడ్డి, కోదాటి దయాకర్రావు, సింహాద్రి పాల్గొన్నారు.