హనుమకొండ, నవంబర్ 10 : నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇస్తామన్నా రెండు కోట్ల ఉద్యోగాలను ఇవ్వాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ జిల్లా గ్రంథాలయం ఎదుట డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ దేశంలో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు యువతకు ఇచ్చిన హామీలు కేవలం ఓట్లు దక్కించుకునే ఎత్తుగడలేనని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిన బిజెపి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పుతుందని మండిపడ్డారు.
ఉద్యోగాలు లేకుండా చేస్తుందని, రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఏటా లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ల తోనే ఉద్యోగాలను భర్తీ చేసి చేతులు దులుపుకుందని, ఉద్యోగాలు ఇచ్చేంతవరకు నిరుద్యోగ భృతి నెలకు రూ.4 నిరుద్యోగభృతి ఇస్తామని మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఒక్క నియామక ప్రక్రియ చేపట్టలేదన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం కూడా మరో నిరాశగా మిగిలిందని అన్నారు.జాబ్ మేళాలు నిర్వహించి ప్రైవేటు జాబ్ లు ఇచ్చి ప్రచారం చేసుకోవడం తప్ప ప్రభుత్వ జాబ్ లు ఇచ్చింది లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల సమయంలో ప్రతి యువతి కి చేతికి ఒక స్కూటీ ఇస్తామని చెప్పిన హామీ కూడా మరచిపోయారని విమర్శించారు. డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఓర్సు చిరంజీవి, నాయకులు భోగి నరేష్, కేయూ రీసెర్చ్ స్కాలర్స్ కేతపాక ప్రసాద్, జనగాం రాజారాం, నాయకులు దూడపాక అశోక్,యం.చంద్ర, నిరుద్యోగ సంఘ నాయకులు శ్యామ్, ప్రభాకర్, కామేష్, ప్రశాంత్, రమేష్ ,నవీన్, తిరుపతి, నరేష్, రాకేష్, వంశీ, అనిల్, అఫ్జల్, రాజు, అనిత, స్వప్న, స్రవంతి, శ్వేత, సంధ్య పాల్గొన్నారు.