న్యూశాయంపేట, మార్చి 7 : డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని గోపా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిర్ర రాజు గౌడ్ డిమాండ్ చేశారు. హంటర్ రోడ్డులోని గోపా భవన్లో మంగళవారం జిల్లా కార్యవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ క్రియాశీల పాత్ర పోషించారన్నారు. ఎంతో మందికి ఉచిత వైద్యం అందించారన్నారు. సుధాకర్ గౌడ్ కుమారుడికి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫోన్ చేసి భయభ్రాంతులకు గురిచేయడాన్ని గోపా జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా సుధాకర్ గౌడ్కు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో గోపా రాష్ట్ర కార్యదర్శి రాజేశ్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సురేశ్గౌడ్, కోశాధికారి చిర్ర ఉపేందర్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, నాయకులు పోశాల కుమార్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మార్క సునీల్గౌడ్, గౌని సాంబయ్య గౌడ్, బత్తిని రాజేందర్ గౌడ్, బుర్ర సుధాకర్ గౌడ్, మధు గౌడ్, ఏరుకోండ రమేశ్ గౌడ్ పాల్గొన్నారు.