చిన్నగూడూరు, జనవరి 20 : బాధిత కుటుంబాలకు రాష్ట్ర సర్కారు అండగా ఉంటుందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. గత నెల 31న గ్రానైట్ లారీ ఢీకొని చిన్నగూడూరు మండలం మంగోరిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే రెడ్యా, అధికారుల ప్రత్యేక చొరవతో గ్రానైట్ యజమానుల నుంచి బాధిత కుటుంబాలకు రూ.11.50లక్షల ఆర్థిక సాయం అంద జేశారు. బానోత్ సుమన్, డెంగన నవీన్, యాకారపు శ్రీకాంత్ మృతి చెందగా, ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల చొప్పున రూ.6లక్షలు, గాయాలై చికిత్స పొందుతున్న బానోత్ రాము, బొడ్డు శేఖర్కు రూ.2 లక్షల చొప్పున రూ.4లక్షలు, గాయాలైన నూనావత్ వీరన్న, బానోత్ రమేశ్, లింగంపల్లి రాంబాబుకు రూ.50 వేల చొప్పున రూ.లక్షా50వేలు ఎమ్మెల్యే రెడ్యా అందజేశారు.
అనంతరం మృతుల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున, గాయపడిన ఐదుగురికి రూ.2వేల చొప్పున ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం రెడ్యా మాట్లాడుతూ.. గ్రానైట్ లారీ ఢీకొని ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు వల్లూరి వెంకట రెడ్డి, మూల మురళీధర్రెడ్డి, మండల అధ్యక్షుడు రాంసింగ్, కేసముద్రం మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్, సర్పంచ్లు నవీన్, వెంకటరమణ, సీఐ సాగర్, ఎస్సై రవికుమార్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల నుంచి వయా గున్నెపల్లి మీదుగా పడమటిగూడెం వరకు రూ.9.60 కోట్లతో ఆర్అండ్బీ రోడ్డు మంజూరు కాగా, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు శుక్రవారం ఉగ్గంపల్లిలో ఎమ్మెల్యే రెడ్యాను కలిసి సన్మానించారు. రోడ్డు మంజూరుకు కృషి చేసిన రెడ్యాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సంపెట రాము, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ మల్లారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ధర్మారపు వేణు, ఎంపీటీసీ వెంకన్న, మండల నాయకులు మధుకర్రెడ్డి, ఉప్పల్రెడ్డి, సుధాకర్రెడ్డి, తండ రామన్న, సారంగపాణి, ఉప్పలయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.