పరకాల, అక్టోబర్ 28 : రక్తదానం ప్రాణదానంతో సమానమని ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని జీఎంఆర్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల సంరక్షణలో పోలీసులు కీలకమన్నారు. పోలీసు అమరవీరుల సేవలను నిరంతరం స్మరించుకోవాలన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతో మంది మృతి చెందుతున్నారన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కనై ఆరు నెలలకు ఒక్కసారి రక్తదానం చేయాలని కోరారు. ఈ రక్తదాన శిబిరంలో 100 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు చెప్పారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ డీసీపీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఈవీ శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు, పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండి సారంగపాణి, పరకాల ఏసీపీ జూపల్లి శివరామయ్య, సీఐలు పుల్యాల కిషన్, శ్రీనివాసరావు, భాస్కర్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
రక్తదాతలకు అభినందన
శాయంపేట : మండలానికి చెందిన తెలంగాణ జాగృతి యువత రాష్ట్ర నాయకుడు అమ్మ అశోక్, శాయంపేట ఉప సర్పంచ్ దైనంపల్లి సుమన్ పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఆదివారం రక్తదానం చేశారు. పరకాలలో నిర్వహించిన రక్తదానం శిబిరంలో అమ్మ అశోక్ 27వ సారి రక్తదానం చేయగా, సుమన్ 14వ సారి రక్తదానం చేశారు. ఈ మేరకు ఇద్దరినీ డీసీపీ వెంకటలక్ష్మి, ఏసీపీ శివరామయ్య, శాయంపేట సీఐ శ్రీనివాస్రావు, ఎస్సై ఇమ్మిడి వీరభద్రారావు అభినందించారు.
గాయత్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో..
హనుమకొండ చౌరస్తా : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని హనుమకొండ కాకాజీకాలనీలోని గాయత్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో నర్సంపేట సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్, వరంగల్ యువ నేతాజీ ఫౌండేషన్ సహకారంతో ఆదివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని హనుమకొండ సఖీ సెంటర్ కౌన్సిలర్ ప్రియాంక, చెంగెల్లి జగన్, గాయత్రి హాస్పిటల్ డైరెక్టర్ దేవునూరి ఆనంద్, సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్, అబ్దుల్ హసీం ప్రారంభించారు. కరోనా కష్టకాలంలో అత్యవసర సమయంలో రక్తం అందక చాలా మంది ఇబ్బందిపడ్డారని, అందుకే ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, స్వచ్ఛందంగా 35 మంది యువకులు రక్తదానం చేయగా, వారికి సర్టిఫికెట్లు ఇచ్చినట్లు సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గొంగళ్ల అశోక్ తెలిపారు. కార్యక్రమంలో అలువాల తేజస్వి, వరంగల్ యువ నేతాజీ ఫౌండేషన్ అధ్యక్షుడు కొత్తకొండ అరుణ్కుమార్, పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు(స్విమ్మర్ రాజు), కైలాసపు సంతోష్, బొట్టు కమలాకర్, కోలా రాజేశ్, గజ్జెల సుమన్, అలువల పృథ్వీ, మునిగాల రాంప్రసాద్, లక్ష్మణ్, ఉప్పరపల్లి రాజ్కుమార్, సృజన, మండల భూపాల్, లీగల్ అడ్వైజర్ రాచకట్ల కృష్ణ, చెలిమల్ల అశోక్కుమార్, తూనం రాము, వైనాల రమేశ్, మోడెం రాజశేఖర్గౌడ్, నాగవెళ్లి కార్తీక్ పాల్గొన్నారు.