హనుమకొండ, జులై 23: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శనివారం బాలసముద్రంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెకులను చీఫ్ విప్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినయ్ భాసర్ మాట్లాడుతూ అనారోగ్యం బారినపడి ఇబ్బంది పడుతున్న వారికి వైద్య ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయనిధి చెకులను అందిస్తోందన్నారు. ఇందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 14 మందికి రూ.11,03,500 విలువగల చెకులను పంపిణీ చేసినట్లు తెలిపారు. బడ్జెట్లో రూ.వేల కోట్లు వైద్యానికి, వైద్య సేవలకు ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణదేనన్నారు. ఆపదలో ఉన్న నియోజకవర్గ ప్రజలు ఎలాం టి సమయంలోనైనా క్యాంపు కార్యాలయానికి కానీ, స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్రావు, టీఆర్ఎస్ నాయకులు పులి రజినీకాంత్, నయీమొద్దీన్, జానకిరాములు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ముందస్తు చర్యలు చేపట్టాలి
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు చేపట్టడంతోపాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో హనుమకొండలో గ్రేటర్ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం వడ్డేపల్లి బండ్ను సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో సీఎంఏ, సాధారణ నిధులు, పట్టణ ప్రగతి కింద జరుగుతున్న అభివృద్ధి పనులపై డివిజన్ల వారీగా మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. నగర అభివృద్ధిలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమష్టి కృషితో నగర అభివృద్ధి కృషి చేద్దామని కోరారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని పారులను సుందరీకరించాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. వడ్డేపల్లి బండ్ సుందరీకరణ కోసం అదనపు నిధుల కేటాయించడానికి అధికారులను పర్యవేక్షించాలని ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఈ రాజయ్య, డీఈలు సంతోష్, రవికుమార్, ఏఈలు శ్రీకాంత్, విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.