పోచమ్మమైదాన్, డిసెంబర్ 8 : ములుగు రోడ్డులోని గణపతి సచ్చిదానంద వరద దత్తక్షేత్రంలో దత్తాత్రేయ స్వామి జయంతిని గురువారం కనుల పండువగా నిర్వహించారు. పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా సుప్రభాత సేవతో అభిషేకం ప్రారంభించారు. అనంతరం ఉత్సవమూర్తికి తైలాభిషేకం చేయించి, దత్తహోమం, పూర్ణాహుతి జరిపారు. అలాగే మధ్యాహ్నం మూల విరాట్ వరద దత్తస్వామికి తైలంతో అభిషేకం, క్షీరాభిషేకం చేశారు. అనంతరం అలంకరణ, సప్త రుషుల హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారి తైలాభిషేకంలో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ హెల్త్ అధికారి జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదంతో పాటు మహా అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వైవీ వామన్రావు, అడ్డగుడి వెంకటేశ్వర్లు, కంటెం లక్ష్మీనారాయణ, బెండల అర్జున్రావు, కృష్ణప్రసాద్, చకిలం ఏకాంబరం, తోట శివకుమార్, వద్దిరాజు శార్వాణి, ఆలయ అర్చకులు రామయ్య శర్మ, రాపాక గోపీకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు.